రక్తదాతల నుంచి రక్తం సేకరించి పేద ప్రజలకు అందించాలి.
కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 13 (అఖండ భూమి న్యూస్)
జిల్లాలో రక్తదాన శిబిరాలను విరివిగా నిర్వహించి దాతల నుండి రక్తాన్ని సేకరించి పేద ప్రజల ఆరోగ్య ఆసరాల కొరకు వినియోగించేందుకు ప్రభుత్వానికి బ్లడ్ యూనిట్స్ ను అందించినందుకు జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ సేవలను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర శాఖ గుర్తించి ప్రపంచ రక్తదాతల దినోత్సవం 2025 సందర్భంగా గౌరవ రాష్ట్ర గవర్నర్ మరియు రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ జిష్ణు దేవ్ వర్మ గారి చేతుల మీదుగా ఈనెల 14 వ తేదీ ఉదయం 10:30 గంటలకు హైదరాబాదులోని రాజ్ భవన్ లో అవార్డును అందుకోనున్నారు.
జిల్లా నుండి జిల్లా కలెక్టర్ తో పాటు నరేంద్ర ఆచార్య మట్ సంస్థాన్ కామారెడ్డి వారు కేటగిరి వన్ కింద అవార్డును స్వీకరించనున్నారు.