భూభారతి రెవెన్యూ సరస్సుల ద్వారా స్వీకరించిన అర్జీలు క్షుణ్ణంగా పరిశీలించాలి.
కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్.
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 13 (అఖండ భూమి న్యూస్);
భూభారతి రెవెన్యూ సదస్సుల ద్వారా స్వీకరించిన అన్ని అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు.
శుక్రవారం పాల్వంచ మండలం పార్దిపెట్ గ్రామంలో నిర్వహించిన భూభారతి రెవిన్యూ సదస్సును జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నా రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసున్నారు. భూ సమస్యల పరిష్కారానికి ఒక చక్కని వేదిక భూభారతి ఆర్ఓఆర్ చట్టం అని ఎలాంటి భూ సమస్యలు ఉన్న రెవెన్యూ సదస్సులలో దరఖాస్తు పెట్టుకొంటె ప్రభుత్వ అధికారులు వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని సూచించారు. దరఖాస్తుల పరిష్కారానికి రెవెన్యూ సిబ్బంది చేస్తున్న కసరత్తును పరిశీలించి తమ సమస్యలను తీరుస్తారనే నమ్మకంతో రెవెన్యూ సదస్సులలో రైతులు భూ సంబంధ సమస్యలపై దరఖాస్తులు పెట్టుకుంటున్నారని. వారు పెట్టుకునే ప్రతీ ఒక ప్రతి అర్జీని మరియు ఆ అర్జీకి సంబంధించిన భూ వివరాలను రెవెన్యూ రికార్డులలో క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. దరఖాస్తులన్నింటిని కచ్చితంగా ఆన్లైన్లో పొందుపరిచాలని, ఆలస్యం చేయకుండా అవసరమైన వారికి నోటీసులు జారీ చేసి భూమికి సంబంధించిన త్వరగా పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని తాసిల్దార్ హిమబిందు మరియు రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. అనంతరం మొక్కలకు నీరు పోశారు.
అలాగే గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇందిరమ్మ లబ్ధిదారులు త్వరగా ఇండ్లు నిర్మించుకునేలా చూడాలని, ఇంకా ప్రారంభించని ఇండ్ల నిర్మాణం పనులు వెంటనే ప్రారంభించేలా చూడాలని ఎంపీడీవో శ్రీనివాస్ ను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇసుక కొరత రాకుండా లబ్ధిదారులు ఉచితంగా ఇసుకను తీసుకువెళ్లేలా చర్యలు తీసుకోవాలని తాసిల్దార్ ను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డిఓ వీణ, మండల ప్రత్యేక అధికారి శ్రీపతి తదితరులు పాల్గొన్నారు.