కురుపాం ఎమ్మెల్యే ని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా మహిళా సమాఖ్య సభ్యులు…
పార్వతీపురం మన్యం జిల్లా ప్రతినిధి జూన్ 17( అఖండ భూమి న్యూస్) దత్తిమహేశ్వరరావు
గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ విప్ మరియు కురుపాం శాసనసభ్యురాలు *తోయక* *జగదీశ్వరి* మంగళవారం నాడు మన్యం జిల్లా మహిళా సమాఖ్య సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. మహిళా సంఘాల అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని ఎమ్మెల్యే కోరారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే మహిళల అభివృద్ధికి ఎల్లప్పుడూ తన వంతు సహాయం ఉంటుందని ఈ సందర్భంగా అన్నారు. ఎమ్మెల్యే ని కలిసిన వారిలో జిల్లా మహిళా సమాఖ్య ప్రెసిడెంట్ కె.లలితకుమారి, సెక్రెటరీ సుబ్బలక్ష్మి, ట్రెజరర్ పి.రాజేశ్వరి, తదితరులు ఉన్నారు.
You may also like
-
బాల కార్మికుల నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి
-
సీఎం బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా టిడిపి సంబరాలు
-
కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయంలో విద్యా మిత్ర కిట్ల పంపిణీ
-
సామాజిక సేవలో ఆదర్శంగా నిలుస్తున్న శ్రీను కి ఘన సన్మానం!
-
రైతులకు ఖరీఫ్ పంట విత్తనాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు.