జిల్లాలో నాణ్యమైన బియ్యం మొక్కజొన్నలను మార్కెటింగ్ చేయాలి ….
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 17 (అఖండ భూమి న్యూస్)
కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ఆశీస్ సాంగ్వాన్ అధ్యక్షతన జిల్లాస్థాయి ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కమిటీ సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా ఫిబ్రవరిలో జరిగిన మొదటి డిఎల్ఈపిసి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై జిల్లా కలెక్టర్ సమీక్షించారు. మొదటి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు పూర్తిస్థాయిలో అమలు కాకపోవడంతో అధికారుల అసహనం వ్యక్తం చేశారు. జిల్లాలో మంచి క్వాలిటీ గల బియ్యం, మొక్కజొన్న , సోయాబీన్ పంటలు పండుతున్నాయని వీటిని సరైన రీతిలో మార్కెటింగ్ ,ఎక్స్పోర్ట్ చేస్తే జిల్లాకు మంచి గుర్తింపు వస్తుందని, రైతులకు వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయని అన్నారు. జిల్లా పరిశ్రమలశాఖ అధికారుల సలహాలు తీసుకొని జిల్లాలోని వ్యాపారులు, మిల్లర్లు హైదరాబాదులోనీ కామర్స్ అండ్ ఎక్స్పోర్ట్ శాఖ వారితో సంప్రదించి జిల్లా నుంచి మంచి క్వాలిటీ గల రైస్, మొక్కజొన్నలు, సోయాబీన్ ఎక్స్పోర్ట్ చేయాలని సూచించారు. జిల్లా నుండి నాణ్యమైన ఉత్పత్తులు ఎక్స్పోర్ట్ అయ్యేలా పరిశ్రమల శాఖ అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షించాలని జిఎం డిఐసి లాలు నాయక్ ను ఆదేశించారు. అదేవిధంగా జిల్లాలో మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడంలో భాగంగా జిల్లా మహిళా సమైక్య ద్వారా ఒక రైస్ మిల్లును ఒక పెట్రోల్ పంపును ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ కామర్స్ & ఇండస్ట్రీస్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ శైలజ, ఎంఎస్ఎంఈ అసిస్టెంట్ డైరెక్టర్ రాజేష్ నాయక్, డిఆర్డిఓ సురేందర్, జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్, ఎల్డిఎం చంద్రశేఖర్, జిల్లా మార్కెటింగ్ అధికారి రమణ, రైస్ మిల్లర్లు, వ్యాపారులు, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.