నెలవారీ నేర సమీక్షా నిర్వహించిన జిల్లా ఎస్పీ

నెలవారీ నేర సమీక్షా నిర్వహించిన జిల్లా ఎస్పీ

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 17 (అఖండ భూమి న్యూస్)

కామారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా పోలీస్ అధికారులతో నెలవారీ నేర సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ సమావేశంలో పాల్గొన్న పోలీస్ అధికారులతో ఎస్పీ మాట్లాడుతూ,పెండింగ్ అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్న కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులు పరిమితంగా ఉండాలని, గ్రేవ్ కేసుల్లో SOP పాటిస్తూ, త్వరగా, నాణ్యమైన దర్యాప్తు పూర్తి చేసి బాధితులకు న్యాయం అందించాలని, చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న కేసుల ను అడిగి త్వరితగతిన వాటి విచారణ పూర్తిచేయాలి అని సూచించారు.

పోలీస్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల గౌరవంగా వ్యవహరిస్తూ ప్రతి ఒక్క ఫిర్యాదును స్వీకరించిన వెంటనే సమస్య పరిష్కరించే దిశగా కృషి చేయాలని తెలిపారు.

పోలీసు అవగాహన కార్యక్రమాలు గ్రామ గ్రామాన నిర్వహిస్తూ ప్రజలతో మంచి సత్సంబంధాలను ఏర్పరుచుకోవాలని, సమాచార వ్యవస్థను మరింత పటిష్టం చేసుకోవాలని సూచించారు.

జిల్లాలో పనిచేసే ప్రతి ఒక్క అధికారి నీతినిజాయితీతో విధులను నిర్వర్తించాలని, ఎలాంటి ఆసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా విధినిర్వహణలో తనదైన పనితనాన్ని చూపించాలన్నారు.

కేసుల నమోదులో నేరస్తులను త్వరగా అరెస్టు చేసి రిమాండ్కు పంపాలని సూచించారు.

పోలీస్టేషన్ల నందు ప్రతిరోజు సిబ్బంది క్రమశిక్షణ మరియు సమయపాలన ను కలిగి ఉండేలా, ప్రతిరోజు రోల్ కాల్ ను నిర్వహించి పర్యవేక్షించాలన్నారు. పట్టణాల నందు బీట్ సిస్టం మరింత పట్టిష్టంగా నిర్వహిస్తూ ఎలాంటి దొంగతనాలు జరగకుండా గస్తీ నిర్వహించాలని సూచించారు. పోలీ స్టేషన్లో గ్రామాలకు కేటాయించిన విలేజ్ పోలీస్ ఆఫీసర్ వ్యవస్థను పర్యవేక్షిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చూడాలన్నారు. డయల్ 100 నకు ఫోన్ రాగానే సంఘటనా స్థలానికి చేరుకొని బాధితులకు అండగా నిలబడాలని సూచించారు. జిల్లా ప్రజలు సైబర్ క్రైమ్స్ బారిన పడకుండా నిత్యం అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ అప్రమత్తం చేయాలని సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ఎలాంటి అలసత్వం వహించారాదని అన్నారు.

మద్యం సేవించి వాహనాలను నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు కారణమయ్యే వ్యక్తులపై నిత్యం డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించాలని సూచించారు.

ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ కే నరసింహారెడ్డి, కామారెడ్డి ఏఎస్పి చైతన్య రెడ్డి, డీఎస్పీలు శ్రీనివాస్ రావు, విఠల్ రెడ్డి, , స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ తిరపయ్య, సీఐలు మరియు ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!