ప్రపంచ యోగ దినోత్సవ సందర్భంగా ప్రదర్శన…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 21 (అఖండ భూమి న్యూస్)
ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా దోమకొండ మండల కేంద్రంలో యోగశాలలో శనివారం యోగాసనాలు వేసి ప్రదర్శన నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు యోగాసనాలు వేసి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని అన్నారు. యోగాతోనే ప్రస్తుతం విస్తరిస్తున్న అనేక రోగాలకు ముందస్తుగా యోగా నిర్వహిస్తే వాటిని ఎదుర్కొనే సత్తా యోగాసనాల ద్వారా ఉందని అన్నారు. సంపూర్ణ ఆరోగ్యంగా నిలదొక్కుకోవాలంటే యోగాను నిత్య పనిగా పరిగణించి ఆసనాలు వేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో యోగా గురువులు అంకం బాలరాజ్, గర్దాస్ కృష్ణ హరి, రాజు, అబ్రా బోయిన స్వామి, అల్లి రవి, ముత్యం గౌడ్, కుంచాల సత్యనారాయణ, ఎల్లన్న, పెద్దిరెడ్డి రాజిరెడ్డి, సుధాకర్, కృష్ణారెడ్డి, సలీం, బొ రెడ్డి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…


