ఎదిగేకొద్దీ ఒదగాలి,వ్యక్తిగత అభివృద్ధి కి సోపానం
కవి,లెక్చరర్ ఉమాశేషారావు వైద్య
కామారెడ్డి జిల్లా ప్రతినిధి! జూన్ 23,(అఖండ భూమి న్యూస్);
మనిషి ఎంత ఎదిగినా ఒదిగి వుండాలి కానీ అహంకరించకూడదు.అహంకారం అనేది నైతికంగా మనిషిని అధఃపాతాళానికి తొక్కేస్తుంది.అలాగే ఆత్మా భిమానం మంచిదే కానీ దుర భిమానం ఎప్పుడూ ఇబ్బందు లు కలిగిస్తుంది. సకల శాస్త్ర పారంగతుడిని అన్న అహం తోనే రావణాసురుడు తప్పు చేసి, శ్రీరాముని చేతుల్లోహతు డైనాడు.దుర్యోధనుడు దురభి మానంతో తొడలు విరిగి నేల కూలాడు.ఎంతటి తపోధను లైనా సరే అహంకరిస్తే వాళ్ళ తపఃశక్తిని కోల్పోయి, మళ్లీ సంపాదించిన అంశాలెన్నో మ న పురాణ,ఇతిహాసాల్లో ఉ న్నాయి.ద్వైతవనంలో ఉన్న పాండవులనుఅవమానించడానికి దుర్యోధనుడు దూర్వాసు నికి సకల సేవలు చేసి మెప్పు పొంది, ఆయనను పాండవుల మీదికి పంపుతాడు. సూర్య వర ప్రసాదంతో అక్షయపాత్ర ను పొందిన పాండవులు ఎం దరో అన్నార్తుల ఆకలి తీరు స్తూ అడవిలో సుఖంగా వున్నా రు. విశేషం ఏమిటంటే ద్రౌపది తిన్న తర్వాత ఆ పాత్ర తన శక్తిని కోల్పోతుంది. అది తెలిసి దుర్వాసుడు సమయం మించి వెళతాడు. అప్పుడు ద్రౌపది శ్రీకృష్ణుని ప్రార్థిస్తుంది. ఆ ఆపన్నపరాయణుడు అందరినీ స్నానాదులు ముగించుకుని భోజనానికి రమ్మని చెప్పిస్తాడు. అప్పుడు పరమాత్మ లీలచే అక్షయపాత్ర లో ఒక మెతుకు దొరుకుతుం ది. అది తిని భగవానుడు నా కడుపు నిండినది అని త్రేన్చ గానే దుర్వాసునికి, అతని నూర్గురు శిష్యులకు అందరికి పొట్ట నిండిపోయి ఆయాసంతో అతలాకుతలం అవుతుంటారు. సమయంలో ధర్మజుని ఆజ్ఞ తో భీముడు అందరినీ భోజనా నికి ఆహ్వానిస్తాడు. శ్రీకృష్ణుడు కూడా వారికై ఎదురుచూస్తూ ఉన్నాడని చెబుతాడు. అప్పు డు వారు ఎవరి అండలో ఉన్నాడో ఆ లీలామానుష మూర్తిని గుర్తెరిగిన దూర్వా సుడు తన తప్పిదం తెలుసు కొని ఆయనకు ప్రణమిల్లి అహంకారంతో కోల్పోయిన తమ శక్తిని తిరిగి సంపాదిం చుకునేందుకు తపస్సుకు వెళ్ళిపోతాడు.అలాగే విశ్వా మిత్రుడు కూడా. ఇలా ఎన్నో దృష్టాంతాలు అంటే ఋజు వులు మన పురాణ కథల్లో ఉన్నాయి.పురాణాలు మన నైతికతకు గురువులు. ఏది, ఎందుకు, ఎప్పుడు చెయ్యాలి, చేయకూడదు అన్నఇంగితాన్ని బోధిస్తాయి.మహాద్భుతమైన మన పుణ్యభూమి, కర్మభూమి గొప్పదనం తెలుసుకుంటే విజ్ఞా నవంతులైలోకశ్రేయస్సును పెంపొందిస్తారు.నేను, నాది అన్నఅహంకారంవీడండి.భగవంతుడి అండను పొందండి..