ఎయిడెడ్ పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈఓ…
వెల్దుర్తి జూన్ 30 (అఖండ భూమి వెబ్ న్యూస్) : స్థానిక వెల్దుర్తి పట్టణంలోని ఎస్సీ కాలనీ కి చెందిన ఎయిడెడ్ పాఠశాలను సోమవారం ఎంఈఓ రమేష్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులతో మాట్లాడారు. ఈ విద్యా సంవత్సరానికి కేటాయించిన స్కూల్ యూనిఫామ్, బ్యాగ్స్, బుక్స్ వినియోగించుకోవాలని అన్నారు. గత విద్య సంవత్సరానికి చెందిన యూనిఫామ్ ను ధరించకూడదని తెలిపారు. విద్యార్థిని విద్యార్థుల హాజరు నమూనా రెగ్యులర్ గా ఆన్లైన్ చేయాలని ఉపాధ్యాయురాలుకు సూచించారు. విద్యార్థులు ఎక్కువగా ఉన్నందువలన ఇంకో ఉపాధ్యాయురాలు కేటాయించాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అదేవిధంగా మిడ్ డే మీల్స్ విద్యార్థిలకు సక్రమంగా రుచికరంగా వడ్డించాలని మెనూ పాటించాలని తెలిపారు. లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..