స్పెషల్ డ్రైవ్ ద్వారా 130 మొబైల్ ఫోన్ ల రికవరీ…
కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం రాజేష్ చంద్ర..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 5 (అఖండ భూమి న్యూస్);
పోయిన సెల్ ఫోన్లతో పాటు చోరీకి గురైన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సి ఈ ఐ ఆర్ ద్వారా తిరిగి తమ యొక్క ఫోన్లను పొందవచ్చని జిల్లా ఎస్పీ ఎం రాజేష్ చంద్ర అన్నారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోగొట్టుకున్న, చోరికి గురైన 130 మొబైల్ ఫోన్లను (సుమారు 17 లక్షలు విలువగల) స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఫోన్లను బాధితులకు అప్పగించడం జరుగుతుందని అన్నారు. ఈ మొబైల్ రికవరీలో రాష్ట్రంలోని జిల్లాల కమిషనర్ రేట్లు మినహాయిస్తే కామారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని అన్నారు. ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ. ఇప్పటివరకు చేసిన ఫోన్ల వివరాలను బాధితులకు తెలియజేయడం జరుగుతుందన్నారు. ఎస్పీ కార్యాలయానికి (870 2686 114) ఫోన్ కు సంబంధించిన వివరాలను చూపించి ఫోన్లను పొందాలని అన్నారు.
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…



