ప్రభుత్వ బడుల్లో చదువుకునే పిల్లలకి ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలి.

ప్రభుత్వ బడుల్లో చదువుకునే పిల్లలకి ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలి.

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ;జూలై 10. (అఖండ భూమి న్యూస్);

బీసీ, ఎస్సీ, ఎస్టి, జేఏసీ, రాష్ట్ర కన్వీనర్ డా, విశారదన్ మహారాజ్ ఆదేశాల మేరకు కామరెడ్డి జిల్లా ఏవో కి వినతి పత్రం బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ, ఆధ్వర్యంలో ప్రభుత్వ స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచిత బస్సు ఏర్పాటు చేయాలని జేఏసీ ద్వారా కలెక్టర్ కి తెలియజేయడం జరిగింది. బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ సభ్యులు నీల నాగరాజు(ముదిరాజ్ ) జిల్ల బీసీ సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 26,000 పైగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి, దానిలో 22 లక్షల పైన బడుగు బలహీనవర్గాల పేద విద్యార్థులు పాఠశాలలో చదువుచున్నారు, వారికి ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించాలని , కామారెడ్డి జిల్లా బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ, ఆద్వర్యంలో , తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ సభ్యులు నీల నాగరాజు (ముదిరాజ్) బీసీ సంఘం జిల్లాఅధ్యక్షులు . లక్ష్మణ్ ,బోలేశ్వర్,రాజు, గంగరాజు , రాజశేఖర్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!