*మెడిసిటీ హాస్పిటల్, ఘనపూర్, మేడ్చల్, లయన్స్ క్లబ్ ఆఫ్ రామాయంపేట స్నేహబందు ఆధ్వర్యంలో మెగాఉచిత వైద్య శిభిరం …

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 12 (అఖండ భూమి న్యూస్)
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంట ఉర్దూ భవన్ ఫంక్షన్ హాల్ దగ్గర ఉదయం 09గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉచిత వైద్య శిబిరం శనివారం నిర్వహించడం జరిగింది.
ఈ వైద్య శిభిరంలో బీపీ, షుగర్ పరీక్షలు మరియు కంటి పరీక్షలతో పాటు చెవి,ముక్కు,గొంతు,
వరిబీజము,బీజకుట్టు,గడ్డలు,కనథులు,థైరాయిడ్ గడ్డలు,గర్భసంచికి సంబంధించిన సమస్యలు,కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు,చర్మ సమస్యలు,మోకాళ్ళ నొప్పులు,నడుము నొప్పులు, ఊపిరితిత్తుల సమస్యలపై శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో దాదాపు 387 మంది పాల్గొన్నారు. 80 వేల రూపాయల విలువ గల మందులు ఉచితంగా పంపిణీ చేయటం జరిగింది. 65 మంది కంటి శాస్త్ర చికిత్స (ఆపరేషన్) త్వరలోనే ఉచితంగా చేస్తామని ఆసుపత్రి నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్నేహబంధు హెల్త్ క్యాంప్ చైర్పర్సన్ దామోదర్ రావు, సభ్యులు హనుమంతరావు, బాలరాజు, శ్రీకాంత్, సాయి, సందీప్, సత్యం తదితరులు పాల్గొన్నారు.
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…


