*మెడిసిటీ హాస్పిటల్, ఘనపూర్, మేడ్చల్, లయన్స్ క్లబ్ ఆఫ్ రామాయంపేట స్నేహబందు ఆధ్వర్యంలో మెగాఉచిత వైద్య శిభిరం …
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 12 (అఖండ భూమి న్యూస్)
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంట ఉర్దూ భవన్ ఫంక్షన్ హాల్ దగ్గర ఉదయం 09గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉచిత వైద్య శిబిరం శనివారం నిర్వహించడం జరిగింది.
ఈ వైద్య శిభిరంలో బీపీ, షుగర్ పరీక్షలు మరియు కంటి పరీక్షలతో పాటు చెవి,ముక్కు,గొంతు,
వరిబీజము,బీజకుట్టు,గడ్డలు,కనథులు,థైరాయిడ్ గడ్డలు,గర్భసంచికి సంబంధించిన సమస్యలు,కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు,చర్మ సమస్యలు,మోకాళ్ళ నొప్పులు,నడుము నొప్పులు, ఊపిరితిత్తుల సమస్యలపై శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో దాదాపు 387 మంది పాల్గొన్నారు. 80 వేల రూపాయల విలువ గల మందులు ఉచితంగా పంపిణీ చేయటం జరిగింది. 65 మంది కంటి శాస్త్ర చికిత్స (ఆపరేషన్) త్వరలోనే ఉచితంగా చేస్తామని ఆసుపత్రి నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్నేహబంధు హెల్త్ క్యాంప్ చైర్పర్సన్ దామోదర్ రావు, సభ్యులు హనుమంతరావు, బాలరాజు, శ్రీకాంత్, సాయి, సందీప్, సత్యం తదితరులు పాల్గొన్నారు.
You may also like
-
కొత్త రేషన్ కార్డుదారులకు శుభవార్త.. త్వరలో వీరికి ఆరోగ్యశ్రీ …
-
మాజీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ తిరుమల్ రెడ్డిని పరామర్శించిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…
-
దంపతులు ఇరువురికి ప్రశంశ పత్రాలు…
-
అంగన్వాడి, రెసిడెన్షియల్ , సంక్షేమ హాస్టల్ లకు గుడ్ల సరఫరాకు టెండర్…
-
వన క్షేమమే మన క్షేమం – కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్…