బాకీర్తిపల్లి లోమొక్కలు నాటిన షబ్బీర్ అలీ…

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 13 (అఖండ భూమి న్యూస్)
కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం బాగిర్తిపల్లి గ్రామంలో వన మహోత్సవంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబ్బీర్ ఆదివారం మొక్కలు నాటారు. అనంతరం ఈ సందర్భంగా మాట్లాడుతూ. ప్రతి గ్రామంలో మొక్కలు నాటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. ఎలాంటి సీజనల్ వ్యాధులు లేకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండి పరిసరాలను పరిశుభ్రం తో పాటు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి భావితరాలకు పెద్ద వృక్షాలుగా అందించి పర్యావరణ కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు,కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…


