ఆటోలు గ్రామానికి వెళ్ళిన ఎమ్మెల్యే.
అల్లూరి జిల్లా గూడెం కొత్త వీధి, అఖండ భూమి,మే 8:- అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధీ మండలం లకవరపు పేట పంచాయతీ సురవరం గ్రామానికి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పాడేరు ఎమ్మెల్యే కే భాగ్యలక్ష్మి సందర్శించారు. ప్రధాన రహదారి నుండి సురవరం వెళ్లే రోడ్డు అస్తవ్యస్తంగా బురదమయం కావటంతో ఎమ్మెల్యే యొక్క వాహనం గ్రామానికి వెళ్లలేకపోవటంతో సురవరం మొదటి వీధి నుండి ఎమ్మెల్యే ఆటోలో సురవరం గ్రామానికి వెళ్లారు. గ్రామంలో ఉప సర్పంచ్ గంగాధర్,సురవరం మహిళలు తమ యొక్క రోడ్డు కష్టాలను ఎమ్మెల్యేకు వివరించారు. ఫారెస్ట్ క్లియరెన్స్ లేకపోవటంతో రోడ్డు నిర్మాణం జరగటంలేదని స్వయంగా మీరు మా రోడ్డు స్థితిని చూశారు కాబట్టి ఫారెస్ట్ క్లియరెన్స్ కొరకు సహకరించాలని ఎమ్మెల్యేను కోరారు.సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే స్వయంగా రోడ్డు యొక్క స్థితిని చూశాను కాబట్టి ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లి ఫారెస్ట్ క్లియరెన్స్ కొరకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
You may also like
-
ఫీజులు పేరుతో విద్యార్థులకు, తల్లిదండ్రులకు వేధింపులు…. అర్థ సంవత్సరం లోపే మొత్తం ఫీజు కట్టాలని డిమాండ్….. జూన్ నెలలోనే సగం ఫీజు వసూలు చేస్తున్న రిఫరల్ స్కూల్ యాజమాన్యం..
-
స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ భారత్ ఎనిబెర అనూష ఆధ్వర్యంలో ఏర్పాటు కార్యక్రమం
-
మాతా మారెమ్మ జాతర సజావుగా జరుపుకోండి.. సీఐ బి మధుసూదన్ రావు
-
గ్రామాల అభివృద్ధి మా ప్రభుత్వ లక్ష్యం
-
గునుపూడి లో ఏరులై పారుతున్న మద్యం