ఆర్.ఆర్ స్కూల్ లో ఘనంగా బోనాల పండుగ…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 19 (అఖండ భూమి న్యూస్);
పాల్వంచ మండల కేంద్రంలోని ఆర్.ఆర్ పాఠశాలలో శనివారం రోజున బోనాల పండుగను శనివారం ఘనంగా నిర్వహించారు.
ఆర్.ఆర్ పాఠశాలలో బోనాల పండుగను (బోనాలు ఫెస్టివల్ ) ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ టి. నరేందర్ రెడ్డి మాట్లాడుతూ. బోనాల పండుగ తెలంగాణ రాష్ట్రంలో ఆషాడ మాసంలో జరుపుకునే ముఖ్యమైన పండుగ అన్నారు. ఈ పండుగను హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో , రాష్ట్రంలోని ప్రాంతాలలో పండుగను ఘనంగా జరుపుకుంటారన్నారు.
బోనాల పండుగ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు స్కూల్లోనే తయారుచేసిన నైవేద్యాన్ని తలపై పెట్టుకుని ఊరేగింపుగా దేవాలయాలకు వెళ్లి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. విద్యార్థులు పోతరాజుల విన్యాసాలతో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా సాంప్రదాయ నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, రామ్ రెడ్డి సునీల్ రెడ్డి,రామచంద్రం, రాణి మానస,మౌనిక, విజయరాణి, రేఖ విద్యార్థి,విద్యార్థులు పాల్గొన్నారు.
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…



