కల్తీకల్లు పేరిట ఎక్సైజ్ అధికారులు చేస్తున్న దాడులను ఆపాలి…
…. జై గౌడ ఉద్యమం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు రంగోల్ల మురళి గౌడ్..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 20 (అఖండ భూమి న్యూస్);
కల్తీకల్లు విక్రయిస్తున్నారని గౌడ కులస్తులపై ఎక్సైజ్ అధికారులు చేస్తున్న దాడులను ఆపాలని జై గౌడ ఉద్యమం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు రంగోల్ల మురళి గౌడ్ విజ్ఞప్తి చేశారు. కామారెడ్డి పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.మద్యం మాఫియా కు తలోగ్గి కులవృత్తిని నిర్వీర్యం చేయవద్దన్నారు. కల్తీ జరిగితే చర్యలు తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో గెలవడానికి మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఐదు ఎకరాల స్థలం,డ్రిప్ సౌకర్యం కల్పించి ఈత చెట్లను పెంచే విధంగా ప్రోత్సహించాలన్నారు. ఈ కార్యక్రమంలో జై గౌడ ఉద్యమం జిల్లా ప్రధాన కార్యదర్శి అంకన్న గారి శ్రీనివాస్ గౌడ్,నాయకులు ఇందూరి సిద్ధ గౌడ్, కర్రోల్ల శేఖర్ గౌడ్ , బొంబోతుల సురేష్ గౌడ్, తాటిపాముల ప్రశాంత్ గౌడ్,బాలా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
You may also like
కలెక్టరేట్ ప్రజావాణిలో 125 దరఖాస్తులు స్వీకరణ…
_పీఎం కిసాన్ డబ్బులు పడలేదా? ఈ నెంబర్కు కాల్ చేస్తే చాలు!_
కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు…
ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ ఐ ఆర్) 2026 ఓటరు జాబితా పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం…
25 న నిర్వహించనున్న నశా ముక్త్ భారత్ అభియాన్ ర్యాలీని విజయవంతం చేయాలి…



