ఆర్యవైశ్య ఆధ్వర్యంలో మల్లికార్జున స్వామి, పోచమ్మ ఆలయాల్లో పూజలు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 20 (అఖండ భూమి న్యూస్);
ఆదివారం ఆషాడ మాసం చివరి ఆదివారం సందర్భంగా బీబీపేటలో గల శ్రీ మల్లికార్జున స్వామి , పోచమ్మ తల్లి దేవాలయంలో ఆర్యవైశ్య మహిళలు ఉదయం నుండి, స్వామివారికి , అమ్మ వారికి పూజలు నిర్వహించారు. లలిత సహస్ర పారాయణాలు, పాటలు, చిన్న చిన్న ఆటలు, అమ్మవారికి ఒడిబియాలు సమర్పించారు.
అక్కడే ఆషాడ మాస వనభోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహిళలు పాల్గొన్నారు.