సకల జీవుల మనుగడకు చెట్లే ఆధారం
స్ఫూర్తి సేవా సమితి. డోన్ నంద్యాల జిల్లా
అఖండ భూమి వెబ్ న్యూస్ :
ఈ భూమ్మీద ఉండే సకల జీవుల మనుగడకు చెట్లే ఆధారమని, ప్రతి ఒక్కరు బాధ్యతగా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాలని డోన్ ప్రభుత్వ గైనకాలజిస్ట్ డాక్టర్ రమ్యశిల్ప, రాష్ట్ర వాల్మీకి సంఘం డైరెక్టర్ వలసల రామకృష్ణ అన్నారు. స్ఫూర్తి సేవా సమితి ఆధ్వర్యంలో డోన్ లో గల మహాత్మ గాంధీ జ్యోతి రావ్ బాపూలే గురుకుల బాలికల స్కూల్ నందు గురువారం నాడు చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమంకి ముఖ్య అతిథులుగా హాజరై పాఠశాల సిబ్బంది, స్ఫూర్తి సభ్యులతో కలిసి మొక్కలు నాటారు. మొక్కలు నాటడమనేది సామాజిక సేవల్లో ప్రధానమని కార్యక్రమం చేపట్టిన స్ఫూర్తి సభ్యులను, మొక్కలు అందించిన మెహతాజ్ షోరూం జహంగీర్ ని వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, స్ఫూర్తి సభ్యులు స్ఫూర్తి మధు, భాస్కర్, చంద్ర, మోహన్ రెడ్డి, జహంగీర్, టీచర్ రంగనాథ్, రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..