ముందస్తు అరెస్ట్ కి గురి అయిన భీంగల్ మండల్ బి ఆర్ ఎస్ నాయకులు 

ముందస్తు అరెస్ట్ కి గురి అయిన భీంగల్ మండల్ బి ఆర్ ఎస్ నాయకులు

భీంగల్ ప్రతినిధి ముఖిద్ బాల్కొండ నియోజకవర్గం అఖండ భూమి భీంగల్  వెబ్ న్యూస్ :

నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీంగల్ మండలంలోని ముందస్తు అరెస్టు పేరుతో బి ఆర్ ఎస్ నాయకులని అరెస్టు చేసిన భీమ్గల్ పోలీస్ శాఖ

కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాదయాత్ర సందర్భంగా ముందస్తుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులని శనివారం నాడు సుమారు 6 గంటల సమయంలో అరెస్టు చేసి భీమ్గల్ టౌన్ కి తరలించడం జరిగింది ఈ విషయంపై మాజీ మంత్రి బాల్కొండ శాసనసభ్యుడు వేముల ప్రశాంత్ రెడ్డి మా నాయకులని అరెస్టు చేసి టౌన్ లో పెట్టడం కరెక్ట్ అయిన పద్ధతి కాదని పోలీస్ శాఖ పై ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు ముందస్తు అరెస్టుకి గురి అయిన నాయకులు మండల అధ్యక్షులు దొనకంటి నర్సయ్య,మాజీ ఎంపీపీ ఆర్మూర్ మహేష్, కౌన్సిలర్లు జోగన్పల్లి సతీష్ గౌడ్,బొదిరె నర్సయ్య,మాజీ సర్పంచ్ లు ఎస్పీ ప్రవీణ్ కుమార్,ఎర్రోళ్ల సంజీవ్, మాజీ ఎంపీటీసీ ఎం.ఎ.సుర్జిల్, బీఆర్ఎస్ పార్టీ పురాణిపేట గ్రామ శాఖ అధ్యక్షులు సుంకరి గాంధీ భీంగల్ మాజీ మైనార్టీ అధ్యక్షుడు మహమ్మద్ ఇక్రామ్

రెహమాన్ సిద్ధికి మూత లింబాద్రి లను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది.

బి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు దొంకంటి నరసయ్య మాట్లాడుతూ మమ్మల్ని అరెస్టు ఎందుకు అరెస్టు చేస్తున్నారని భీమ్గల్ ఎస్ఐ నీ అడుగుతే ఆర్మూర్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ పాదయాత్ర ఉందని టిఆర్ఎస్ నాయకులని ముందస్తు అరెస్టు చేస్తున్నామని చెప్పారు పాదయాత్ర ఆర్మూర్ పట్టణంలో జరిగినప్పుడు భీంగల్ నాయకులకు అరెస్టు చేయడం ఎంత దాకా కరెక్ట్ అని మండల అధ్యక్షుడు దొనకంటి పోలీస్ శాఖ పైన మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీకి టిఆర్ఎస్ నాయకులతో ఇంత భయం ఎందుకని భీంగల్ మండల అధ్యక్షుడు ప్రశ్నిస్తున్నారు సానుభూతి కోసం భీంగల్ పోలీస్ టౌన్ కి తరలివచ్చిన బిఆర్ఎస్ నాయకులు

Akhand Bhoomi News

error: Content is protected !!