రోటరీ ఆధ్వర్యంలో బాలసదన్ లో రక్షాబంధన్ కార్యక్రమం…
సామాజిక సేవకు ముందుకు రావాలి..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 9 (అఖండ భూమి న్యూస్);
రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి ఆధ్వర్యంలో బాలసదన్ లో రక్షాబంధన్ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిడిపిఓ ఎం.స్వరూపా రాణి,రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ డాక్టర్ ఎం జైపాల్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ ఎం జైపాల్ రెడ్డి వారు మాట్లాడుతూ రక్షాబంధన్ కార్యక్రమం ఒకరికి ఒకరు రక్ష గా ఉండాలని అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని అన్నారు.సామాజిక సేవా కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని తోటి వారి పట్ల మానవతా దృక్పథాన్ని కలిగి ఉండాలని అన్నారు.
సిడీపీఓ ఎం స్వరూపారాణి మాట్లాడుతూ బాలసదన్ లో రోటరీ క్లబ్ వారు రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు సంతోషంగా ఉందని,రక్షాబంధన్ కార్యక్రమం మన దేశంలో ఆడపడుచుల పండగగా రక్షాబంధన్ ను పిలుచుకుంటారని తెలియజేశారు.ఈ సందర్భంగా చిన్నారులకు పరీక్ష అట్టలను, కంపాక్స్ బాక్స్ మరియు పరీక్ష కిట్టు ను అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రోటరీ అధ్యక్షుడు శంకర్,ట్రెజరర్ రమణ కుమార్ రోటరీ మెంబర్స్ బాలరాజు, ధనుంజయ్,నాగభూషణం,దత్తాద్రి రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు,బాలసదన్ సూపరిండెంట్ సంగమేశ్వరీ తదితరులు పాల్గొన్నారు.
You may also like
-
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి రాఖీ కట్టిన కామారెడ్డి తాజా మాజీ మున్సిపాల్ ఛైర్ పర్సన్…
-
అడవిలింగాల గ్రామంలో విద్యుత్ షాక్ తగిలి రెండు మేకలు మృతి …
-
దోపిడి బంగారం ఆభరణాలు స్వాధీనం… కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర..
-
గంప గోవర్ధన్ కు రాఖి శుభాకాంక్షలు తెలిపిన సోదరిమణులు
-
కామారెడ్డి జిల్లాలో ఘనంగా జరిగిన రక్షాబంధన్ వేడుకలు