6వంటగదే ఒక ఔషధ నిలయం
మన ఆరోగ్యం మన చేతుల్లో            
 
సేకరణ.వైద్య… ఉమాశేషారావు..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 11(అఖండ భూమి న్యూస్);
మాములుగా వచ్చే జలుబూ జ్వరాల నుండి తీవ్రంగా వుండే ఆస్తమా, మధుమేహం వరకూ కూడా మన వంటిట్లో ఉన్న వస్తువులతో తగ్గించుకోవచ్చు. మరీ తీవ్రంగా ఉంటే డాక్టర్ వద్దకు వెళ్ళాలి.“`
1) పసుపు:పసుపుని పై పూతగా మరియూ లోపలికి కూడా తీసుకుంటారు.నీళ్లతో కలిపి పాదాలకు పూయడం వలన ఫంగస్ వ్యాధులు,గజ్జి మరియూ ఇతర బాక్టీరియా వ్యాధులు తగ్గిపోతాయి. కాళ్ళ పగుళ్లు కూడా రాకుండా ఉంటాయి.
పసుపుని కొద్దిగా నూనెతో కలిపి కాలి వేళ్ళ మధ్య పూస్తే నీళ్లలో నానడం ద్వారా వచ్చే ఎలర్జీ తగ్గి పాదాలకి అందం కూడా వస్తుంది.ముఖానికి పూస్తే నల్ల మచ్చలు, మొటిమలు పూర్తిగాతగ్గిపోతాయి.పసుపులో బెల్లం కలిపి తింటే కడుపులో మంట, అల్సర్లు తగ్గుతాయి.పసుపు పూయ డం వల్ల శరీరం మీద వచ్చే ఎర్రని దద్దుర్లుతగ్గుతాయి.
బాలింతలకు ఇస్తే పాలు బాగా పడుతాయి.వేడి పాల లో ఒక గ్రాము పసుపు కలిపి ఇస్తే జలుబు, దగ్గు, తగ్గిపోతాయి. 5 గ్రాముల పసుపు, 5 గ్రాముల ఉసిరి పొడి కలిపి ఉదయం పరక డుపున తీసుకుంటే మధు మేహం క్రమేణా తగ్గుతుంది.
పసుపు నిత్యం తీసుకునే వారిలో జీర్ణవ్యవస్ధ కి సంబంధించిన క్యాన్సర్ లు రాకుండాఉంటాయి.“` ధనియాలు:
కాచి చల్లార్చిన నీటిలో నాలుగో వంతు దంచిన పచ్చి ధనియాలను రెండు గంటల పాటు నానబెట్టి అందులో చక్కెర కలిపి ఆ నీటిని త్రాగితే జ్వరం వెంటనే తగ్గుతుంది.
దప్పిక, మంట పూర్తిగాపోతుం ది.చెమటబాగాపడుతుంది.పారాసిటమోల్ టాబ్లెట్ కంటే చాలా త్వరగా పని చేస్తుంది.
కళ్ళ కలకలకు ఈ నీటిని వడగట్టి కళ్ళలో వేస్తే దురద, మంట మరియు ఎరుపు రంగు తగ్గిపోతాయి. పచ్చి ధనియా లను నూరి కడితే ఎలాంటి తలనొప్పి అయినా తగ్గిపోతుం ది.మూలవ్యాధి లో, చక్కెర కలిపిన పొడి లేక ధనియాల నీళ్లను ఇస్తే దురద, రక్తస్రావం తగ్గిపోతాయి.మోతాదు: 5 నుండి 10 గ్రా పొడి కి 50 నుండి 100 మి లీ నీరు కలపాలి.`
సోంపుసోంపు ని దంచి నీళ్లలో ఒక గంట నానబెట్టి ఆ తర వాత ఆ నీళ్ళని బాగా కలబెట్టి తాగితే కడుపు నొప్పి, గాస్ట్రీక్ సమస్య తగ్గుతుంది.విరేచనం సాఫీగాఅవుతుంది.నులిపురుగులు కూడా పడి పోతాయి.
కఫం అడ్డగించి ఆయాసపడే వ్యక్తులకు ఇది వెంటనే శ్వాశ నాళాలను తెరిపించి శ్వాశ బాగా ఆడేటట్లు చేస్తుంది.
అతిసార వ్యాధి ఉన్నవారికి మెంతుల పొడితో కలిపి ఈ పొడిని ఇవ్వవచ్చు.సోంపుకి కొన్ని నీళ్ళు కలిపి నూరి మెత్త ని పేస్టులా చేసి ఎముకల నొప్పి ఎక్కడ ఉందో అక్కడ పట్టిస్తే ఎముకల నొప్పి తగ్గు తుంది.మూత్రంలో వచ్చే మంటకు సోంపు చాలా బాగా పని చేస్తుంది.అల్లం మరియూ శొంఠి అజీర్ణ వ్యాధితో బాధ పడేవారు భోజనానికి ముందు చిన్న అల్లం ముక్కను ఒక ఉప్పుతో కలిపి నమిలి తింటే ఆకలి పెరుగుతుంది.నాలుక, కంఠం శుభ్రపడి రుచి బాగా తెలుస్తుంది.తేనెతో కలిపి అల్లం రసం తాగితే దగ్గు, ఆయాసం తగ్గుతాయి.
నీరుల్లితో కలిపి అల్లం రసం తీసుకుంటే వాంతులు ఆగి పోతాయి.ప్రయాణాల్లోవాంతులు వచ్చేవారు రెండు స్ఫూన్ల అల్లం రసం కానీ లేక ఒక స్పూన్ శొంఠి పొడి కానీ తీసుకుంటే 12గంటల వరకు వాంతులురావు.అమీబియాసిస్ వ్యాధికి శొంఠి చాలా మంచిది.కీళ్ల నొప్పులకు శొంఠి పొడి రోజూ తీసుకుంటే వాపు తగ్గికీళ్లుబాగావంగుతాయు.“`
జీలకర..జీలకర్ర వాడటం వలన జీర్ణాశయంలో వచ్చే అల్సర్లు తగ్గుతాయి.లివర్ పనిచేయడంమెరుగుపడుతుంది.నెలల తరబడి బాధించే రక్త విరేచనాలు పూర్తిగా తగ్గిపోతాయి.అతిసారంతో బాధపడే వారికి మజ్జిగ లేక పెరుగుతో కలిపి ఇస్తే గంటలో తగ్గిపోతాయి. మూత్రం కూడా సాఫీగా వస్తుంది.బాలింతలకు పాలు బాగాపడుతాయి.మూలవ్యాధితో ఉన్నవారికి రక్తస్రావం తగ్గుతుంది.నిద్ర బాగా వ స్తుంది.శరీరంలో ఏ కండ రము నొప్పి అయినా సరే కొన్ని గంటల్లో తగ్గిస్తుంది.“`
లవంగాలు: ఇవి పళ్ళకి, కంఠానికి సంబంధించిన వ్యాధులలో చాలా బాగా పని చేస్తుంది.చిగుళ్ల నుండి రక్తం కారే వారు ఒక లవంగం బుగ్గన పెట్టుకోవడం అలవాటు చేసు కుంటేచిగుళ్ళుగట్టిపడుతాయి.
నోటి దుర్వాసన దూరం అవు తుంది.పిప్పి పన్ను మొదటి దశలో లవంగాన్ని మెత్తటి పొడి చేసి పన్ను భాగంలో నింపి ఒక గంటసేపు అలాగే ఉంచగలిగితే వెంటనే పోటు తగ్గి దంతక్షయం కలుగకుండా ఉంటుంది.వేడి నీళ్లలో నాలు గు లవంగాలు వేసి ఆ నీళ్లను ఒక్కో స్పూన్ తాగుతూ ఉంటే కలరా,అతిసారం వంటి వ్యాధుల కారణంగా వచ్చే దప్పిక తగ్గుతుంది.అజీర్ణం, కడుపులో గ్యాస్ చేరడం వంటి సమస్యలకు లవంగాలు చూ ర్ణం 500mg,10 నిమిషాలలో ఫలితం చూపుతుంది.“`
యాలకులు:అతిసారం వల్ల జీర్ణ వ్యవస్థ సక్రమంగా లేని వారికి ఒక గ్లాస్ పాలలో రెండు గ్రాముల యాలకుల పొడిని కలిపి ఇస్తే బలం చేకూరుతుంది.యాలకుల కి కిడ్నీల మీద పని చేసే ప్రభావంకలిగిఉంటుంది.ప్రతి రోజూ యాలకుల పొడిని తీసుకుంటే మూత్రం అధికం గా వచ్చి మూత్రంలో రాళ్లు పోతాయి.గుండె దడ వచ్చే వ్యక్తుల్లో యాలకుల పొడి వలన గుండె దడ తగ్గుతుం ది.మాటమాటకి తల తిరిగే వ్యక్తులకు యాలకులను చక్కెర పొడి మరియూ నేతితో కలిపి తీసుకోవడం ద్వారా ఈ సమస్య పోతుంది.“`
దాల్చిని చెక్క:ఇది పళ్లకు, చిగుళ్ల కు సంబంధించిన సమస్యలకు బాగా పని చేస్తుంది.దీని వలన ఆహారం జీర్ణం బాగా అవుతుంది.
తినే ఆహారంలో దాల్చిని చెక్క చేర్చడం వల్ల కాన్సర్, అల్సర్లు రాకుండాఉంటాయి.టైఫాయిడ్ జ్వరం ఉన్నపుడు ఈ పొడిని వేడి నీళ్లలో కాసేపు ఉంచి ఆ నీటిని వేడి చేసి ఇస్తే జ్వరంతగ్గుతుంది.సూక్ష్మజీవుల వలన కలిగే విషప్రభావం తగ్గుతుంది. రక్త స్రావం కాకుండా ఆపుతుంది.
చీటికీ మాటికీ నోటిలో పుండ్లు వచ్చే వారికి ఈ దాల్చిని చెక్క చూర్ణం చాలా మంచిగా పని చేస్తుంది.`
గసగసాలు:
వీటిని ఒక గ్లాస్ వేడి నీళ్లలో ఒక గంటసేపు ఉంచి ఆ తర్వాత తాగితే తలనొప్పి తగ్గుతుంది.అలసట వల్ల కలిగిన వంటి నొప్పులు కూడా తగ్గుతాయి.వీటి పొడి మజ్జి గలో కలిపి తాగితే నీళ్ల విరే చ నాలుఅరగంటలోతగ్గిపోతాయి.అరగ్రాము పొడి పాలతో కలి పి తాగితే నిద్ర బాగా పడుతుం ది.గొంతు వాచి నొప్పిగా ఉన్న ప్పుడు వీటి కషాయం తో పుక్కిలిస్తే నొప్పి తగ్గుతుంది
అందుకే వంటిల్లే ఒక వైద్యాలయం


