రోటరీ క్లబ్ కామారెడ్డి ఆధ్వర్యంలో,అంతర్జాతీయ యువజన దినోత్సవం

రోటరీ క్లబ్ కామారెడ్డి ఆధ్వర్యంలో,అంతర్జాతీయ యువజన దినోత్సవం

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 12.(అఖండ భూమి న్యూస్);

స్థానిక ఆర్కె డిగ్రీ మరియు పీజీ కళాశాలలో రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి ఆధ్వర్యంలో అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా “స్థానిక యువత చర్యలు – స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు, భవిష్యత్తు” అనే 2025 థీమ్ పై మోటివేషనల్ ట్రైనింగ్ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డా. బి.అంజయ్య, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ. “యువత దేశ భవిష్యత్తు. ప్రతి యువకుడు లక్ష్యం పెట్టుకొని కృషి చేస్తే, సమాజం అభివృద్ధి దిశగా వేగంగా సాగుతుంది” అని ఆన్నారు. అతిథిగా డా.ఎం. జైపాల్ రెడ్డి, అసిస్టెంట్ గవర్నర్ మాట్లాడుతూ – ” స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల సాధనలో స్థానిక యువత ముందుండాలి. చిన్న ప్రయత్నాలు పెద్ద మార్పులు తీసుకొస్తాయి” అని అన్నారు.

ప్రోగ్రామ్ చైర్మన్ పున్నా రాజేష్ (లెర్నింగ్ ఫెసిలిటేటర్) కార్యక్రమాన్ని సమన్వయం చేశారు.

ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి అధ్యక్షుడు ఆర్ టి ఎన్. యాచం ఆర్ టి ఎన్. సుధాకర్ , కార్యదర్శి ఆర్ టి ఎన్. సబ్బని కృష్ణ హరి, కోశాధికారి ఆర్ టి ఎన్. పరుష వెంకటరమణ ఆర్కే డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ గోవర్ధన్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ బాలు, ఏవో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ లింగం,ప్రశాంత్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!