ఆయా శాఖల అధికారులు విధి నిర్వహణలో పగడ్బందీగా నిర్వహించాలి…

కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 12 (అఖండ భూమి న్యూస్);
ఆయా శాఖల అధికారులు మండల కేంద్రాలతో పాటు పరిధిలోని గ్రామాలలో పగడ్బందీగా పక్కా ప్రణాళికలతో పనులు నిర్వహించాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. మంగళవారం దోమకొండ, బీబీ పేట మండల కేంద్రాలలో ఏర్పాటుచేసిన అధికారుల సమావేశంలో ఈ సందర్భంగా మాట్లాడారు. ఆయా శాఖల అధికారులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించకుండా పక్కా ప్రణాళికతో గ్రామాల్లో పనులు విజయవంతం అయ్యేవిధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. దోమకొండ, బీబీ పేట మండల కేంద్రాలలో ఏర్పాటుచేసిన సమావేదానికి ఏఎన్ఎంలు, ఆశా వర్కర్ లు, అంగన్వాడి సూపర్వైజర్లు, సిడిపిఓ, మండల వ్యవసాయ శాఖ అధికారులు, ఎం పి ఓ, పంచాయతీ అధికారులు, విద్యుత్, రోడ్డు భవనాల శాఖ హౌసింగ్ శాఖ, అటవీ శాఖ, సివిల్ పోలీసులు, మత్స్యశాఖ, ఇందిరా క్రాంతి పథకం, రెవెన్యూ శాఖల అధికారులతో పలు విషయాలపై చర్చించారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే అధికారుల పాత్ర ఎంతో ముఖ్యమని విధి నిర్వహణలో నిర్లక్ష్యం లేకుండా అభివృద్ధి సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల ప్రజలు, పాల్గొన్నారు
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…


