విధుల్లో అలసత్వం వహించిన ఎస్సై, కానిస్టేబుల్ సస్పెన్షన్
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 12,( అఖండ భూమి న్యూస్) కామారెడ్డి జిల్లాలో విధుల్లో అలసత్వం వహిస్తున్న పోలీసులపై జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర కొరడా ఝులిపిస్తున్నారు. గతంలో ఇద్దరు ఎస్సైలు, హోంగార్డులు, కానిస్టేబుళ్లపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు.
తాజాగా విధుల్లో అలసత్వం వహించిన ఓ ఎస్సై, కానిస్టేబుల్పై చర్యలకు ఉపక్రమించారు. విధుల్లో నిర్లక్ష్యం చేస్తున్నారని దోమకొండ కానిస్టేబుల్ విశ్వనాథ్ను సస్పెండ్ చేస్తూ ఎస్పీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే పిట్లంఎస్సై రాజును ఏఆర్ హెడ్ క్వార్టర్స్కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో ఒకేసారి ఇద్దరు పోలీసులపై ఎస్పీ క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం శాఖలో చర్చనీయాంశంగా మారింది.
You may also like
ఖరీఫ్ సీజన్ కి యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి…
కామారెడ్డి నియోజకవర్గంలో యూరియా కొడత లేనే లేదు…
కాచాపూర్ లో గంగమ్మ దేవి ధ్వజ స్తంభ ప్రతిష్టాపన మహోత్సవం ఉత్సవాలు…
బండ రామేశ్వర్ పల్లి లో ఘనంగా గ్రామ దేవత మూర్తుల ప్రతిష్ట మహోత్సవ ఉత్సవాలు…
కామారెడ్డిలో ఎరువుల దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్, ఎస్పీ…



