రెడ్డి పేట్ హైస్కూల్లో తనిఖీ చేసిన కామారెడ్డి ఎమ్మెల్యే…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 13 (అఖండ భూమి న్యూస్); కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డి పేట్ జిల్లా పరిషత్ పాఠశాలను కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి బుధవారం తనిఖీ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పూర్తిస్థాయిలో సౌకర్యాలు అందుతున్నాయా లేదా అనే దానిపై సిబ్బందిని వివరాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో మౌలిక సదుపాయాలు, త్రాగునీటి వసతులు, విద్యా బోధన తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించి విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలని సూచించారు. మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం అందించి సహకరించాలన్నారు. విద్యా బోధన తీరుపై విద్యార్థులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
You may also like
కలెక్టరేట్ ప్రజావాణిలో 125 దరఖాస్తులు స్వీకరణ…
_పీఎం కిసాన్ డబ్బులు పడలేదా? ఈ నెంబర్కు కాల్ చేస్తే చాలు!_
కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు…
ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ ఐ ఆర్) 2026 ఓటరు జాబితా పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం…
25 న నిర్వహించనున్న నశా ముక్త్ భారత్ అభియాన్ ర్యాలీని విజయవంతం చేయాలి…


