మాహనీయుల త్యాగాలఫలితమే మన దేశానికి స్వాతంత్ర్యం

రామచందర్ రావు మాట్లాడుతూ ఎందరో మాహనీయుల త్యాగాలఫలితమే మన దేశానికి స్వాతంత్ర్యం

(పటాన్చెరు మండలం ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 15 )

79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా  తెలుగు దేశం పార్టీ పార్లమెంట్ కార్యాలయం మహబూబాబాద్ లో కోండపల్లి రామచందర్ రావు టిడిపి పార్లమెంట్ కన్వీనర్ మహబూబాబాద్ మహాత్మా గాంధీ,డా॥అంబేద్కర్ ,సుభాష్ చంద్రబోస్ చిత్రపటాలకు పూలమాలలు వేసి జాతీయ జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్బంగా రామచందర్ రావు మాట్లాడుతూ ఎందరో మాహనీయుల త్యాగాలఫలితమే మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి మనం స్వేచ్ఛగా జీవిస్తున్నామని తెలిపారు. సుతారపు వెంకటనారాయణ టిడిపి మాజీ రాష్ట్ర కార్యదర్శి,డోర్నకల్ నియోజకవర్గ రాష్ట్ర పరిశీలకులు మాట్లాడుతూ ఎంతో మంది మహనీయులుపోరాడి సాధించిన ఈ స్వాత్రంత్ర ఫలాలు పూర్తిగా అందరికి అందాలని ఆకాక్షించారు.

ఈ కార్యక్రమంలో ప్రెమ్ చంద్ వ్యాస్ టిడిపి పార్లమెంట్ మాజీ అధికార ప్రతినిధి,కోండపల్లి రామచంద్రమ్మ మాజీ ఎంపీటీసీ,టిడిపి రాష్ట్ర మాజీ మహిళ అధికారి ప్రతినిధి ,తల్లాడి శ్రీనివాస్ పట్టణ ప్రదాన కార్యదర్శి ,దోంతు నరేశ్ పట్టణ యువత అద్యక్షులు ,పట్టణ ఎస్టి సెల్ అద్యక్షులు బాలు నాయక్ నాయకులు స్వాతి ,భూపతి కిషోర్ పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!