ప్రాణంగా ప్రేమించిన కొడుకు జ్ఞాపకార్థం కోసం వాటర్ ప్యూరిఫై వితరణ

-నవనాథపురం పాఠశాలకు
-మణికంఠ పేరుతో.. బారడ్ కిరణ్
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి మనోహర్ ఆగస్టు 16: (అఖండ భూమి న్యూస్) ఆర్మూర్, పట్టణం పెద్ద బజారు లోని నవనాథపురం పాఠశాల విద్యార్థుల అవసరాల కోసం పట్టణానికి చెందిన బారడ్ కిరణ్ 79 వ స్వతంత్ర దినోత్సవం రోజు వాటర్ ప్యూరిఫై ని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలికి అందజేశారు. ప్రాణతి ప్రాణంగా ప్రేమించే మణికంఠ అనారోగ్యంతో ఈ మధ్యకాలంలో మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అనుముకున్నాయి. కొడుకు జ్ఞాపకార్థం కోసం ఏదైనా చేయాలనే తపనతో మణికంఠ జ్ఞాపకార్థం కోసం వాటర్ ప్యూరిఫై ని అందజేసినట్లు ఆయన కిరణ్ తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయ, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు కిరణ్ ను శాలువాతో సన్మానించి అభినందించి, మణికంఠకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయ, ప్రకాష్, లావణ్య, స్వప్న, అనురాధ, వాహిని తదితరులు ఉన్నారు.


