భారీ వర్షాల నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హెచ్చరిక
(సంగారెడ్డి జిల్లా ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 16)
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావిణ్య మాట్లాడుతూ జిల్లాలో నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు అక్క నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రానున్న ఒకటి రెండు రోజుల కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉందని అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని తెలిపారు. పోలీస్ మండల గ్రామస్థాయి అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.. వ్యవసాయ అధికారులు తమ బోర్ల వద్దకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. గ్రామంలో వీధి దీపాల స్తంభాల దగ్గరికి చిన్నపిల్లలను వెళ్ళనివ్వకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ముందు జాగ్రత్త తీసుకోవాలి . ఏదైనా అత్యవసరం వస్తే తప్ప ఇంటకేంచి బయటకు రావద్దు అని జిల్లా కలెక్టర్ తెలిపారు.



