ప్రథమాంధ్ర మహాసభకు ఆతిథ్యం ఇచ్చిన జోగిపేట
(అందోలు మండల్ ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 16)
నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసి ఆంధ్ర మహాసభకు పురుడు పోసిన గడ్డ జోగిపేట జిల్లాలోనే విశిష్టమైన స్థానాన్ని జోగిపేట సంపాదించింది. అందోల్ నియోజకవర్గం వర్గానికి మొట్ట మొదటిసారిగా స్థానికుడైన స్వాతంత్ర సమరయోధుడు దివంగత బసవమానయ్య ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దివంగత చెర్రీ లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే , ఎమ్మెల్సీగా బాధ్యతులు నిర్వర్తించారు. స్వాతంత్ర సమరయోధుడు దివంగత డాకూరి గాలయ్య గారు ఉన్నారు. అందోల్ జోగిపేట పట్టణంలో పాల రాతితో చెక్కబడి ఎక్కడ లేని విధంగా గాంధీ గారి విగ్రహం ఇక్కడ ఉంది. ఈ విగ్రహం క్లాక్ టవర్ లో ఏర్పాటు చేశారు. దీనినే ప్రజలందరు మధ్యరంగం అని పిలుస్తారు.



