కేతకిలో భక్తులకు అన్నప్రసాదం. దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థానం

(జాయరాసంగం సంఘం ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 18)
కేతకిలో భక్తులకు అన్నప్రసాదం. దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయనికి శ్రావణమాసం పురస్కరించుకొని సోమవారం ఆలయానికి తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక,మహారాష్ట్ర భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు.నాగనాథ్ రెడ్డి,రాజ్ రెడ్డి, ప్రభు రెడ్డి, హుమ్నాబాద్ ఎమ్మెల్యే సోదరుడు సొంతోష్ పాటిల్ హుమ్నాబాద్ వాస్తవ్యులు కేతకి అన్నదాన సత్రంలో ఆలయానికి తరలివచ్చిన భక్తులకు అన్న ప్రసాదం వితరణ చేశారు. వారికి కేతకి ఆలయ కార్యనిర్వహణ అధికారి శివ రుద్రప్ప, ఆలయ చైర్మన్ చంద్రశేఖర్ శాలువతో సన్మానించి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఆలయ రికార్డ్ అసిస్టెంట్ రమేష్ సిబ్బంది తదితరులు ఉన్నారు.


