వెల్దుర్తి మే 13 (అఖండ భూమి) : కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని వెల్దుర్తి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు షేక్ ఖాదర్ బాషా అన్నారు. శనివారం స్థానిక మండల కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయం నందు స్వీట్లు పంచుకొని కార్యకర్తలను ఉత్సాహం పరచడం జరిగింది. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ రావడం ఖాయమని అన్నారు. బిజెపి ప్రభుత్వం గ్యాస్, పెట్రోల్, డీజిల్ అధికంగా పెంచేసి ప్రజలను ఇబ్బంది పడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరి మద్దతు లేకుండా స్వయంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సంచనాత్మకంగా ప్రజలు తీర్పు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ సద్వినియోగం చేస్తుందని తెలిపారు.
You may also like
-
ఫీజులు పేరుతో విద్యార్థులకు, తల్లిదండ్రులకు వేధింపులు…. అర్థ సంవత్సరం లోపే మొత్తం ఫీజు కట్టాలని డిమాండ్….. జూన్ నెలలోనే సగం ఫీజు వసూలు చేస్తున్న రిఫరల్ స్కూల్ యాజమాన్యం..
-
స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ భారత్ ఎనిబెర అనూష ఆధ్వర్యంలో ఏర్పాటు కార్యక్రమం
-
మాతా మారెమ్మ జాతర సజావుగా జరుపుకోండి.. సీఐ బి మధుసూదన్ రావు
-
చెత్త సేకరణ ట్రాలీ అద్దాలను ధ్వంసం చేసిన కౌన్సిలర్..?
-
గ్రామాల అభివృద్ధి మా ప్రభుత్వ లక్ష్యం