వెల్దుర్తి మే 13 (అఖండ భూమి) : కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని వెల్దుర్తి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు షేక్ ఖాదర్ బాషా అన్నారు. శనివారం స్థానిక మండల కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయం నందు స్వీట్లు పంచుకొని కార్యకర్తలను ఉత్సాహం పరచడం జరిగింది. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ రావడం ఖాయమని అన్నారు. బిజెపి ప్రభుత్వం గ్యాస్, పెట్రోల్, డీజిల్ అధికంగా పెంచేసి ప్రజలను ఇబ్బంది పడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరి మద్దతు లేకుండా స్వయంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సంచనాత్మకంగా ప్రజలు తీర్పు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ సద్వినియోగం చేస్తుందని తెలిపారు.
You may also like
మైనార్టీ సంక్షేమ, ప్రభుత్వ సంస్థల పాలన శాఖల మంత్రిగా అజారుద్దీన్….
ఇందిరా పార్క్ వద్ద జరిగిన రెడ్ల నిరసన దీక్ష లో పాల్గొన్న రెడ్డి ఐక్య వేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి…
బిచ్కుంద పుల్కల్ వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి…
ఎస్ జి పి ఉమ్మడి జిల్లా స్థాయి కుస్తీ పోటీలో పాల్గొన్న పైడి ఎల్లారెడ్డి …
యూసఫ్ గూడా లో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ప్రచారం…


