మొబైల్ ఫోరెన్సిక్ వాహనం ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేశ్ చంద్ర
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 22. (అఖండ భూమి న్యూస్)
నేరానికి సంబంధించి సంఘటన స్థలంలోని సాక్ష్యాధారాలను సేకరించి నిందితులను గుర్తించడంలో ఫోరెన్సిక్ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్ విభాగం కామారెడ్డి జిల్లా కు నూతనంగా మొబైల్ ఫోరెన్సిక్ వాహనాన్ని అందజేసారు. ఈ వాహనాన్ని జిల్లా ఎస్పీ యం. రాజేశ్ చంద్ర. జిల్లా పోలీసు కార్యాలయములో పచ్చ జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్బంగా జిల్లా ఎస్పి మాట్లాడుతూ…. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని, అత్యాధునిక పరికరాల తో రూపోందించబడిన ఈ మొబైల్ ఫోరెన్సిక్ వాహనాని కామారెడ్డి జిల్లా పోలీసులకు మరింత మెరుగైన సేవలందించనున్నది. ఇకపై ఎదైనా నేరం జరిగిన ప్రదేశానికి ఫోరెన్సిక్, ఫింగర్ ప్రింట్ అధికారులు, సిబ్బంది ఈ మొబైల్ ఫోరెన్సిక్ వాహనంలో చేరుకోని సంఘటన జరిగిన స్థలం నుండి పలు రకాల సాక్ష్యాదారాలను సేకరించి ఈ మొబైల్ వాహనంలో ఏర్పాటు చేసిన ఆధునిక పరికరాలతో పరీక్షలను నిర్వహించి సంబంధిత దర్యాప్తు అధికారికి ప్రాథమిక సాక్ష్యాధారాలను అందజేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ తెలియజేసారు.
ఈ కార్యక్రమములో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ కే నరసింహారెడ్డి, కామారెడ్డి ఏఎస్పి చైతన్య రెడ్డి, డీఎస్పీలు శ్రీనివాస్ రావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ మరియు ఎస్ఐలు, , క్లూస్ టీమ్, తదితరులు పాల్గొన్నారు
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…



