విజయం విలువ ఎప్పుడు తెలుస్తోంది ..?
కవి,లెక్చరర్ ఉమాశేషారావు వైద్య..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ; ఆగస్టు 27, (అఖండ భూమి న్యూస్ )
మనిషి ఎంత ఎదిగినా ఒదిగి వుండాలి కానీ అహంకరించ కూడదు.అహంకారం అనేది నైతికంగా మనిషిని అధఃపాతాళానికి తొక్కేస్తుంది.అలాగే ఆత్మాభిమానం మంచిదే కానీ, దురభిమానం ఎప్పుడూఇబ్బం దులు కలిగిస్తుంది.సకలశాస్త్ర పారంగతుడిని అన్న అహంతో నే రావణాసురుడు తప్పు చేసి శ్రీరాముని చేతుల్లో హతుడై నాడు.దుర్యోధనుడు దురభి మానంతో తొడలు విరిగి నేల కూలాడు.ఎంతటి తపోధను లైనా సరే అహంకరిస్తే వాళ్ళ తపః శక్తిని కోల్పోయి, మళ్లీ సంపాదించిన అంశాలెన్నో మన పురాణ, ఇతిహాసాల్లో ఉన్నాయి .ద్వైతవనంలో ఉన్న పాండవులను అవమానించడానికి దుర్యోధనుడు దూర్వాసునికి సకల సేవలు చేసి మెప్పు పొం ది, ఆయనను పాండవులమీది కిపంపుతాడు.సూర్య వరప్రదంతో అక్షయపాత్ర ను పొందిన పాండ వులు ఎందరో అన్నార్తుల ఆకలి తీరుస్తూ అడవిలో సుఖంగా వున్నారు. విశేషం ఏమిటంటే ద్రౌపది తిన్న తర్వాత ఆ పాత్ర తన శక్తిని కోల్పోతుంది. అది తెలిసి దుర్వాసుడు సమయం మించివెళతాడు. అప్పుడు ద్రౌపది శ్రీకృష్ణుని ప్రార్థిస్తుంది. ఆపన్నపరాయణుడు అందరినీ స్నానాదులు ముగించుకుని భోజనానికి రమ్మని చెప్పిస్తాడు. అప్పుడు పరమాత్మ లీలచే అక్షయపాత్ర లో ఒక మెతుకు దొరుకుతుంది. అదితిని భగవానుడు నాకడుపు నిండినది అని చెప్పగానే దుర్వాసునికి, అతని నూర్గురు శిష్యులకు అందరికి పొట్టనిండిపోయి ఆయాసంతో అతలాకుతలం అవుతుంటారు. ఆ సమయంలో ధర్మజు ని ఆజ్ఞతో భీముడు అందరినీ భోజనానికి ఆహ్వానిస్తాడు. శ్రీకృష్ణుడు కూడా వారికై ఎదురుచూస్తూ ఉన్నాడని చెబుతాడు. అప్పుడు వారు ఎవరి అండలో ఉన్నాడో ఆ లీలామానుషమూర్తిని గుర్తెరిగిన దూర్వాసుడు తన తప్పిదం తెలుసుకొని ఆయనకు ప్రణమిల్లి అహంకారంతో కోల్పోయిన తమ శక్తిని తిరిగి సంపాదించుకునేందుకు తపస్సుకు వెళ్ళిపోతాడు. అలాగే విశ్వామిత్రుడు కూడా. ఇలా ఎన్నో దృష్టాంతాలు అంటే ఋజువులు మన పురాణ కథల్లో ఉన్నాయి. పురాణాలు మన నైతికతకు గురువులు. ఏది, ఎందుకు, ఎప్పు డు చెయ్యాలి, చేయకూడదు అన్న ఇంగితాన్ని బోధిస్తాయి. మహాద్భుతమైన మన పుణ్య భూమి, కర్మభూమి గొప్పదనం తెలుసుకుంటే విజ్ఞాన వంతులైలోక శ్రేయస్సును పెంపొందిస్తారు. నేను, నాది అన్న అహంకారం వీడండి. భగవంతుడి అండను పొందండి.
You may also like
జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి కలెక్టర్ ఆదేశాలు జారీ…
సీఐటీయూ ఆధ్వర్యంలో డిపిఓ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాన్ని ముట్టడించిన గ్రామపంచాయతీ కార్మికులు
ఎల్లారెడ్డి పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం…
మద్యం సేవించిన 29 మందికి జైలు శిక్ష జరిమానాలు…
దళిత మహిళ అటెండర్ పై కుల వివక్షత చూపిన తహసిల్దార్ ను వెంటనే సస్పెండ్ చేయాలి…