పదోన్నతులు పోలీసులకు మరింత బాధ్యతను పెంచుతాయి

పదోన్నతులు పోలీసులకు మరింత బాధ్యతను పెంచుతాయి

 

-పదోన్నతులు జీవన శైలిని మార్చే విధంగా ఉత్సాహాన్ని కలిగిస్తాయి

-నిజాయితీగా ప్రజలకు సేవలు అందించాలి

-జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబర్ 1, (అఖండ భూమి న్యూస్) పోలీస్ కానిస్టేబుల్ నుండి హెడ్ కానిస్టేబుల్గా పదోన్నతి పొందిన నలుగురు పోలీసులను అభినందించారు. పదోన్నతి చిహ్నాలను అలంకరించిన జిల్లా ఎస్పీ. కానిస్టేబుల్ నుండి హెడ్ కానిస్టేబుల్‌గా ప్రమోషన్ పొందిన వారి వివరాలు:

1. బి. వెంకటేశ్వర్లు నసురుల్లాబాద్ పిఎస్,

2. ఎస్.రమేష్ గౌడ్ తాడ్వాయి పిఎస్,

3. జి. శ్రీనివాస్ – బీర్కూర్ పిఎస్

4. డి. దామోదర్ – (రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి కామారెడ్డికి రావడం జరిగింది) పదోన్నతి పొందిన పోలీసులు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ పదోన్నతి చిహ్నాలను అలంకరించి శుభాకాంక్షలు తెలిపారు.

ఎస్పీ మాట్లాడుతూ

పోలీసు శాఖలో పదోన్నతులు బాధ్యతను మరింత పెంచుతాయి. పదోన్నతులు పొందిన సిబ్బంది రెట్టింపు ఉత్సాహంతో ప్రజలకు సేవలు అందించాలి. క్రమశిక్షణతో, నిబద్ధతతో విధులు నిర్వర్తించే ప్రతి ఒక్కరికీ పోలీసు శాఖలో తగిన గుర్తింపు, గౌరవం లభిస్తుంది. ప్రజల సేవలో నిజాయితీగా పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు దక్కుతుంది. సీనియారిటీ ప్రకారం అందరికీ ప్రమోషన్లు లభిస్తాయి అని తెలిపారు.

పదోన్నతి పొందిన హెడ్ కానిస్టేబుల్‌లు ఈ సందర్భంగా ఆనందం వ్యక్తం చేస్తూ, తమపై విశ్వాసం ఉంచిన ఉన్నతాధికారులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

Akhand Bhoomi News

error: Content is protected !!