ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర టిడిపి కార్యదర్శి ఎస్వీఎస్ అప్పలరాజు
కాకినాడ జిల్లా జగ్గంపేట అఖండ భూమి వెబ్ న్యూస్
ఆనుమాన్ జయంతిని పురస్కరించుకుని జగ్గంపేట మండలం వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి హనుమాన్ ఆలయాలు భక్తులతో కిక్కిరిసి పోయాయి. జగ్గంపేట పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న హనుమాన్ ఆలయంలో ఆలయ ధర్మకర్త రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి ఎస్వీఎస్ అప్పలరాజు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు పులిహార ప్రసాదం పంపిణీ చేశారు. సాయంత్రం హిందూధర్మా ప్రచార సమితి ఆధ్వర్యంలో హనుమాన్ బైక్ ర్యాలీ కూడా నిర్వహిస్తున్నామని కేసరియా హిందూ ధర్మ ప్రచార సమితి జిల్లా అధ్యక్షులు సాహితీ పబ్లిక్ స్కూల్ కరెస్పాండెంట్ వర్మ తెలియజేశారు.



