రైతులు దళారులకు వరి ధాన్యం అమ్మి మోసపోవద్దు..!

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 4 (అఖండ భూమి న్యూస్);
రైతులు దళారులకు వరి ధాన్యం అమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు తరలించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లాలోని దోమకొండ మండలం సీతారాంపూర్ గ్రామంలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన సందర్భంగా మాట్లాడారు. వరి ధాన్యం సన్న రకం వడ్లు రూ 2389 లు, సాధారణ రకం రూ 2369 లకు క్వింటాల్ కు, అదనపు బోనస్ మరో 500 రూపాయలు అందిస్తున్నట్లు తెలిపారు. రైతులు దళారులను మోసపోవద్దని అన్నారు. ప్రతి రైతు కేంద్రాలకి తరలించి రైతులు ఆర్థికంగా బలోపేతం కావాలని సూచించారు. కామారెడ్డి జిల్లాలో సీతారాంపూర్ లో మొట్టమొదటిసారిగా ఈ ఖరీఫ్ కు కొనుగోలు కేంద్రంలో ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులతో పాటు గ్రామ రైతులు పాల్గొన్నారు.
You may also like
గిరిజన గురుకులాల్లో పార్ట్ టైం అధ్యాపకుల నియామకం…
కామారెడ్డి అభివృద్ధికి భారీ నిధులు సాధించిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
విద్యార్థులకు నాణ్యమైన యూనిఫామ్లను సకాలంలో అందించాలి కలెక్టర్…
శాస్త్రీయ ఘన వ్యర్థాల నిర్వహణలో బూరుగుపల్లి ఆదర్శ గ్రామం…
షబ్బీర్ అలీ కలిసిన రామేశ్వర్ పల్లి కాంగ్రెస్ నాయకులు…


