ఎలక్షన్ ఈసీ ఆదేశాల మేరకు ఈవీఎం గోడౌన్ తనిఖీ చేసిన కలెక్టర్…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 7 (అఖండ భూమి న్యూస్);
జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ జిల్లా కేంద్రంలో గల ఎలక్షన్ గోడౌన్ జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ విక్టర్ తో కలిసి సందర్శించి ఈవీఎంలను భద్రపరిచిన గదుల వద్ద రక్షణ చర్యలను మంగళవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సాధారణ తనిఖీల్లో భాగంగా ఈరోజు ఇవిఏం గోడౌన్ సందర్శించి రక్షణ చర్యలను పరిశీలించడం జరిగిందని అన్నారు. అదేవిధంగా ఇవేం గోడౌన్లో సిసి కెమెరాలు 24 గంటలు పని చేసేలా చూడాలని, ఇసిఐ మార్గదర్శకాలు ప్రకారం నిరంతరం బందోబస్తు నిర్వహించాలని పోలీస్ సిబ్బందికి సూచించారు.
ఈ కార్యక్రమంలో కామారెడ్డి తాసిల్దార్ జనార్ధన్, ఎలక్షన్ డిటి తదితరులు పాల్గొన్నారు.


