ఐదురోజుల దీపావళి..!

ఐదురోజుల దీపావళి..!

 

ధన్వంతరీత్రయోదశి: వాడుకలో ధన త్రయోదశి అని అంటూ ఆ రోజు బంగారం కొనాలనే ఆశ పడుతున్నాం!!

కానీ ఆరోజు “ఆయుర్వేదానికి, ఆరోగ్యానికి మూల పురుషుడు శ్రీమన్నారాయణ స్వరూపుడు అయిన “ధన్వంతరీ భగవాన్”

జయంతి ! పాల సముద్రం చిలికిన సమయంలో చేతిలో అమృత భాండముతో అవతరించాడు. నరకచతుర్దశి:

నరక యాతనల నుండి రక్షించమని యముడి ప్రీతి కొరకు , పితృదేవతల ప్రీతి కొరకు ముందు దక్షిణ దిశలో దీపాన్ని వెలిగించి మిగతా అన్ని దీపాలను వెలిగించాలి ! నరకుడు చనిపోయిన రోజు కూడా ఇదే రోజు!!ప్రాక్జ్యోతీషపురం(నేటి అస్సాము) ను పాలించే ‘ నరకుడు’ నర రూప రాక్షసుడు దేవీ ఉపాసకుడు. కానీ దేవిని వామాచారంలో క్షుద్రపూజలు చేసి అనేక అధ్భుత శక్తులను

సంపాదించి దేవతలను కూడా ఓడించాడు ! వాడు ప్రతీ అమావాస్య పౌర్ణమికి నవయవ్వన రాచ కన్యలను దేవికి బలిఇచ్చేవాడు కాముకత్వంతో అనుభవించేవాడు ! నరకుని చెరాసాలలో వేలాది అందమైన మహిళలు (రాచకన్యలు) బందీలుగా వుండేవారు ! ఆదివరాహ మూర్తికి – భూదేవికి కలిగిన సంతానమే ఈ నరకుడు తామస ప్రవృత్తితో జడ్పించాడు. శ్రీకృష్ణ భగవానుడు – సత్యభామ (భూదేవీఅవతారం) తోకల సిగరుడారూఢుడై వచ్చి శక్తి ఉపాసకుడైన నరకుని శక్తి (సత్యభామ) సహకారంతో సంహరించాడు ! నరకుని పీడ విరగడైంది కావున ఇది ‘నరక చతుర్దశి’ !!

దీపావళి:రావణ సంహారం తర్వాత సీతారాములు అయోధ్యకు వచ్చిన శుభ సంధర్భఁగా దీపావళి జరుపు కోవటం , నరకునిబాధలనుండి విముక్తి లభించిన ఆనందంలో దీపావళిని జరుపుకోవటం అనాదిగా వస్తున్న ఆచారం !!

దీపం – లక్ష్మీ స్వరూపం – ఐశ్వర్యస్వరూరంజ్ఞానస్వరూపం అందుకే మనం దీపావళీ రోజు లక్ష్మీపూజలు చేస్తాము !!

వ్వాపారస్తులు కొత్త లెక్కలు వ్రాసుకుంటారుబలిపాఢ్యమి: వామనావతారంలో శ్రీమన్నా రాయణుడు బలి చక్రవర్తిని ‘మూడు అడుగుల’ నేలను దానమడిగాడు !వామన వటు వు కు దానమిచ్చాడు బలి, “ఇంతింతైవటుడింతైనభోరాశిపైనల్లంతై” అన్నట్లుగా ఒక పాదంతో భూమిని, ఎంఇంకోపాదంతో ఆకాశాన్ని ఆక్రమించిన ‘త్రివిక్రముడు’ వేరొక పాదంతో బలిని పాతాళానికి అణచాడు ! సంవత్సరానికి ఒకసారి బలి పాడ్యమి రోజున బలి భూలోకానికి వచ్చి ఇక్కడి దీపకాంతులను చూసి మనమంతా సుఖ శాంతులతో వుండాలని ఆశీర్వదించి వెళతాడట . ఇదీ ఆయనకు వామనుడిచ్చిన వరం !యమ ద్వితీయ:*

సూర్యభగవానునికి యముడు – శనిదేవుడు ఇద్దరు పుత్రులు ! యమున అనే ఒక పుత్రిక కలదు !

యముడు – యమున ఇద్దరూ అన్నా చెల్లెలు కదా ! తన పని (జీవులను ఆయువు మూడిన తర్వాత తన యమపాశం తో ఇడ్చుక వచ్చి వారి వారి కర్మాను సారం వారి వారికి తగిన శిక్షలు విధించే పని)లో పడి పాపం చెల్లెలింటికి వెళ్ళటం లేదు యముడు !!

చెల్లి బతిమాలింది ఒకసారి మా ఇంటికి రా అన్నయ్యా !! అని బతిమాలింది చెల్లెలు!! కార్తీక శుద్ఘవిదియ {మంగళవారం} రోజు తీరిక చేసుకుని తన చెల్లెలింటికి వెళ్ళి హాయిగా కొద్ది సేపు వుండి భోజనం చేసి వచ్చాడు యముడు !!

చెల్లెలైన యమున అన్నయ్యను ఒక వరం అడిగింది ! ఎవరైతే ఈరోజు చెల్లెలింటికి వెళ్ళి చెల్లెలికి కట్నకానుక లిచ్చి వాళ్ళింట్లో భోజనం చేసి వస్తారో వారికి యముని బాధలు లేకుండా చేయి అని అడిగింది !!

ఈ యమునమ్మనే యమునా నది ! కృష్ణ భక్తురాలు ! *భగినీహస్తభోజనం* పేరుతో ఉత్తర భారతంలో ఈ పండుగ ఇప్పటికీ జరుపుకుంటారు ! ఇదీ ఐదు పండుగల కథ

Akhand Bhoomi News

error: Content is protected !!