తెలంగాణ విప్ర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిభా అవార్డు అందుకున్న బెల్లంపల్లి విద్యార్థులు
 
బెల్లంపల్లి,అక్టోబర్ 26అఖండ భూమి న్యూస్):ఆదివారం హైదరాబాద్ లో విప్ర్ ఫౌండేషన్ జోన్ 16 తెలంగాణా ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో కెఎల్ఎన్ ప్రసాద్ ఆడిటోరియం లక్డీ కా పూల్ లో ప్రతిభా అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఇంటర్మీడియట్,డిగ్రీ,డిప్లొమా మరియు బి.టెక్ విభాగాల్లో 90%తో ఉత్తీర్ణులైన విద్యార్థులను ప్రతిభా అవార్డులతో సత్కరించారు.ఇందులో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన బి.టెక్ మొదటి సంవత్సరంలో 9.88 జీపీఏ తో ఉత్తీర్ణులైన వారిలో,వశిష్ట్ పాండే,
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో తెలంగాణా సోషల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాల షేక్ పేట్ సీవోఈ నుండి 99% మార్కులతో ఉత్తీర్ణులైన ప్రథమ్ పాండే, ఇంటర్మీడియట్లో 90% జీ పీ ఏ తో ఉత్తీర్ణులైన ఛవి శర్మలను కండువా కప్పి ప్రతిభా అవార్డులతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో జోన్ 16 విప్ర్ ఫౌండేషన్ అధ్యక్షుడు హరికిషన్ ఓజా,మంత్రి రామ్దేవ్ నాగ్లా,కోఆర్డినేటర్ ఆనంద్ శర్మ ఇతర సభ్యులు పాల్గొన్నారు…


