విద్యాదాత కుమారుని పెండ్లికి రావాలని పెండ్లి పత్రికతో పాటు ఇంటికొ చీర..

– కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 27 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా జనగామ గ్రామంలో ప్రతి ఇంటికి వివాహ పత్రిక తో పాటు చీర భావను అందజేశారు. బిబిపేట మండలంలోని జనగామ గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, విద్యాదాత తిమ్మయ్య గారి రజని – సుభాష్ రెడ్డి ల కుమారుడు నిహాంత్ రెడ్డి – హర్షిత వివాహము నవంబర్ 7 హైదరాబాదులోనీ శంషాబాద్లో జరిగే వివాహ పత్రికను జనగామ గ్రామంలో ఆదివారం ఇంటింటికి అందజేశారు. వివాహ పత్రికతో పాటు చీరలను అందజేసినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ మట్ట శ్రీనివాస్, మాజీ వైస్ ఎంపీపీ రవీందర్ రెడ్డి, సైదు గారి అశోక్ గౌడ్, జీవన్ రెడ్డి, సిద్ధ రామ్ రెడ్డి, బోదాసు సాయి, నీల స్వామి, అంకన్నగారి సుమన్ గౌడ్, పాత స్వామి తదితరులు పాల్గొన్నారు.
You may also like
దోమకొండ శివరాం మందిర్ ఆలయంలో ఎమ్మెల్యే కాటిపల్లి సహకారంతో రథశాల రేకుల షెడ్డు ఏర్పాటు…
నటుడు ప్రకాష్ రాజ్పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ…
దోమకొండ ఎంపీడీవో ని సన్మానించిన సీతారాం మధు ముదిరాజ్…
దోమకొండ లో మండల ఉపసర్పంచ్ ఫోరం అధ్యక్షుడు గా సిరిగాధ మహేందర్ గౌడ్
ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న 7 వరి రకాలను సాగు చేసి బోనస్ పొందాలి…


