విమర్శల వార్తలు రాసే జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు ఏమాత్రం సరికాదు….

విమర్శల వార్తలు రాసే జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు ఏమాత్రం సరికాదు….

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు..!

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 31. (అఖండభూమి న్యూస్):

విమర్శల వార్తలు రాసే జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు పెట్టడం ఏమాత్రం సరి కాదని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఆర్టికల్ 19 (1) (ఏ) ప్రకారం జర్నలిస్టుల హక్కులు రక్షించబడతాయని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, వార్తలు రాసిన జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు పెట్టడం ఎంత మాత్రం సరికాదని వ్యాఖ్యానించింది. విమర్శనాత్మక వార్తలు రాసిన సదర్ జర్నలిస్టును అరెస్టు చేయకుండా, మద్యంతర రక్షణను దేశ అత్యున్నత న్యాయస్థానం మంజూరు చేసింది. తనపై ప్రభుత్వం నమోదు చేసిన కేసులు కొట్టివేయాలని కోరుతూ ఉత్తరప్రదేశ్ కు చెందిన జర్నలిస్ట్ అభిషేక్ ఉపాద్యాయ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కృషికేశ్ రాయ్, జస్టిస్ ఎస్విఎన్ భట్టితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రజాస్వామ్య దేశాల్లో అభిప్రాయాలు వ్యక్తపరిచే స్వేచ్ఛను ప్రతి ఒక్కరూ గౌరవించాలని సూచించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 (1) (ఏ) ప్రకారం జర్నలిస్టుల హక్కులు రక్షించబడతాయని సుప్రీంకోర్టు పేర్కొన్నది….

Akhand Bhoomi News

error: Content is protected !!