*ఘనంగా “వందే మాతరం” 150వ వార్షికోత్సవ వేడుకలు…

• వందే మాతరం గీతం – భారతీయుల హృదయాల్లో దేశభక్తి రగిలించిన ఉద్యమ నినాదం..
• భారత జాతి బానిసత్వ విముక్తి ప్రజల చైతన్యానికి స్ఫూర్తిదాయకమైన వందే మాతరం గీతం..
*• జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ నేతృత్వంలో సిబ్బందితో వందే మాతరం గీతం ఆలాపన..
కామారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఉదయం 10:00 గంటలకు జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, నేతృత్వంలో “వందే మాతరం” జాతీయ గీతం 150వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలు జిల్లా లోని అన్ని పోలీస్ స్టేషన్లు, ఆఫీసుల సిబ్బంది అందరితో కలిసి ఘనంగా నిర్వహించబడ్డాయి.
జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, మాట్లాడుతూ:
వందే మాతరం గీతం భారతీయుల హృదయాల్లో దేశభక్తిని రగిలించే ఉద్యమ నినాదం అయి, ఈ గీతం స్వాతంత్ర్య పోరాటానికి ప్రేరణగా నిలిచిందని అన్నారు. భారత మాత పట్ల భక్తి, త్యాగం , దేశాభిమానానికి ఇది ప్రతీక. ఈ వేడుకలు ప్రతి భారతీయునిలో దేశభక్తి, ఐక్యత , జాతీయ గౌరవాన్ని మరింత బలపరుస్తాయి అని అన్నారు. జాతీయ గీతం పట్ల గౌరవభావాన్ని పెంపొందించడంలో, దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను నిర్వర్తించాలన్నారు. తెలిపారు.
ఈ వేడుకలో జిల్లా ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది , డీపీఓ సిబ్బంది పాల్గొన్నారు.


