కాంగ్రెస్ వీరాభిమాని లింగోజు కిరణ్ కుమార్..!!

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ముఖ చిత్రాన్ని పచ్చబొట్టు వేయించుకున్న కాంగ్రెస్ వీరాభిమాని లింగోజు కిరణ్ కుమార్..!!

(అఖండ భూమి)నవంబర్ 09

చండూరు న్యూస్…

మునుగోడు నియోజకవర్గం చండూర్ మండలం పదో వార్డులో లింగోజు కిరణ్ కుమార్, మునుగోడు నియోజకవర్గం శాసనసభ్యులు,ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి ముఖ చిత్రాన్ని కుడి చేతి పై పచ్చబొట్టు వేయించుకున్న వీరాభిమాని. కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి మంత్రి కావాలన్నదే మా ఆకాంక్ష. ఆయన చేసే మంచి పనులకు ఆదర్శంగా తీసుకొని వారి అడుగుజాడలు నడవాలని దృఢ సంకల్పంతో పదో వార్డుకు ఎనలేని సేవ చేస్తున్నాను అని అన్నారు. కాలనివాసులు మాకు నీటి సమస్య ఉందని కిరణ్ కు చెప్పడంతో వెంటనే స్పందించి పురాతనమైన బోర్లును బాగు చేయించి వాటర్ సమస్యను తీర్చిన,ప్రస్తుత కాలంలో దొంగల బెడద ఎక్కువ ఉన్నందువల్ల కాలనీలో సీసీ కెమెరాలు ఫిట్ చేయించాను. వినాయక చవితికి విగ్రహాలు అన్నదాన కార్యక్రమాలు హోమాలు పూజలు చేయిస్తుంటాను. అదేవిధంగా దేవి నవరాత్రులు వచ్చినప్పుడు గ్రహాలు అన్నదాన కార్యక్రమాలు స్వచ్చందంగా నిర్వహిస్తుంటానని చెప్పారు. కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డికి మంత్రి పదవి రావాలని చండూరు నుంచి శ్రీశైలం వరకు పాదయాత్ర చేయడం జరిగిందని చెప్పుకొచ్చారు. మునుగోడు నియోజకవర్గంలో ఎవరైనా ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాలాడుతున్న చనిపోయిన నా వంతు ఆర్థిక సాయం అందిస్తూ ఉంటానని చెప్పుకొచ్చారు. చండూరు పదో వార్డులో ఎలాంటి సమస్యలున్న దృష్టికి తీసుకురావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు…

Akhand Bhoomi News

error: Content is protected !!