ప్రశాంతంగా ముగిసిన రెండవ విడత పోలింగ్ ప్రక్రియ…

*ప్రశాంతంగా ముగిసిన రెండవ విడత పోలింగ్ ప్రక్రియ…

*రెండు గంటలకు ప్రారంభమైన కౌంటింగ్..

*వృద్ధ ఓటరును పలకరించిన జిల్లా కలెక్టర్..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; డిసెంబర్ 14 (అఖండ భూమి న్యూస్);

 

2వ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఆదివారం నిర్వహించిన ఎన్నికలలో పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్న వృద్ధ ఓటర్లను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడారు

ఈ సందర్భంగా వృద్ధురాలితో మాట్లాడిన కలెక్టర్ ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వయస్సు, ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవడం అభినందనీయమని కలెక్టర్ పేర్కొన్నారు.

ప్రతి అర్హుడైన ఓటరు తప్పనిసరిగా ఓటు వేయాలని, ముఖ్యంగా యువతతో పాటు వృద్ధులు కూడా చురుకుగా ఎన్నికలలో పాల్గొనడం ఎంతో అభినందనీయమని అన్నారు.

అనంతరం మధ్యాహ్నం 2.00 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ కేంద్రాలు ఎల్లారెడ్డి నియోజక వర్గం లోని లక్ష్మాపూర్ , లింగం పేట మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాలను సందర్శించి కౌంటింగ్ ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలని అన్నారు.

ఇందులో సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆర్డీవో పార్థ నరసింహా రెడ్డి, పోలింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!