మాజీ జెడ్పిటిసి తిరుమల్ గౌడ్ ను ఆహ్వానించిన దోమకొండ సర్పంచ్…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; డిసెంబర్ 20 (అఖండ భూమి న్యూస్);
దోమకొండ. దోమకొండ గ్రామపంచాయతీకి నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ఐరేని నరసయ్య శనివారం మాజీ జెడ్పిటిసి సభ్యుడు తిరుమల్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈనెల 22న తన ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ నరసయ్యను తిరుమల్ గౌడ్ శాలువాతో సన్మానించారు.


