సంక్రాంతి పండుగ అనంతరం సర్పంచులకు ప్రత్యేక శిక్షణ…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; డిసెంబర్ 24. (అఖండభూమి న్యూస్):
ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలలో విజయం సాధించిన నూతన సర్పంచులకు సంక్రాంతి పర్వదినం అనంతరం పల్లెల్లో పాలన, నిధుల వినియోగం, అభివృద్ధి, గ్రామసభల నిర్వహణ తదితర అంశాలపై పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. జిల్లాల వారీగా ఒక్కొక్క బృందంగా 50 మంది నుండి 100 మంది ఉండేలా శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సర్పంచులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం జరిగిన అనంతరం ఈ శిక్షణ కార్యక్రమం ప్రారంభం కానుంది.


