చైనా మంజాతో యువకుడి గొంతుకు గాయం….
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ; డిసెంబర్ 27.
(అఖండ భూమి న్యూస్):
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసరలో గాలిపటం మాంజాతో ఓ ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తి మెడకు మాంజా చుట్టుకుంది. దీంతో మెడకు తీవ్ర గాయం (కట్) అయింది. స్థానికులు బాధితులని హాస్పిటల్కు తరలించారు. వైద్యులు బాధితుడి గొంతుకు 19 కుట్లు వేశారు. సంక్రాంతి నేపథ్యంలో దొంగ చాటుగా నిషేధిత మాంజా విక్రయాలు జరుగుతున్నాయి. మళ్లీ ఇలాంటి సంఘటనలు జరగకముందే దుకాణా దారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటే, ఎవరికి ఎలాంటి ఇబ్బందులు రావని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రతి వ్యక్తి బాధ్యతగా భావించి, వాటిని విక్రయించే వారి సమాచారాన్ని పోలీస్ స్టేషన్లకు తెలియజేయాలి. నిషేధిత మాంజాను వినియోగించకుండా చైతన్యవంతం కావాలి….
You may also like
ఖరీఫ్ సీజన్ కి యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి…
కామారెడ్డి నియోజకవర్గంలో యూరియా కొడత లేనే లేదు…
కాచాపూర్ లో గంగమ్మ దేవి ధ్వజ స్తంభ ప్రతిష్టాపన మహోత్సవం ఉత్సవాలు…
బండ రామేశ్వర్ పల్లి లో ఘనంగా గ్రామ దేవత మూర్తుల ప్రతిష్ట మహోత్సవ ఉత్సవాలు…
కామారెడ్డిలో ఎరువుల దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్, ఎస్పీ…


