చైనా మంజాతో యువకుడి గొంతుకు గాయం….

చైనా మంజాతో యువకుడి గొంతుకు గాయం….

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ; డిసెంబర్ 27.

(అఖండ భూమి న్యూస్):

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసరలో గాలిపటం మాంజాతో ఓ ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తి మెడకు మాంజా చుట్టుకుంది. దీంతో మెడకు తీవ్ర గాయం (కట్) అయింది. స్థానికులు బాధితులని హాస్పిటల్కు తరలించారు. వైద్యులు బాధితుడి గొంతుకు 19 కుట్లు వేశారు. సంక్రాంతి నేపథ్యంలో దొంగ చాటుగా నిషేధిత మాంజా విక్రయాలు జరుగుతున్నాయి. మళ్లీ ఇలాంటి సంఘటనలు జరగకముందే దుకాణా దారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటే, ఎవరికి ఎలాంటి ఇబ్బందులు రావని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రతి వ్యక్తి బాధ్యతగా భావించి, వాటిని విక్రయించే వారి సమాచారాన్ని పోలీస్ స్టేషన్లకు తెలియజేయాలి. నిషేధిత మాంజాను వినియోగించకుండా చైతన్యవంతం కావాలి….

Akhand Bhoomi News

error: Content is protected !!