అమెరికాలో రోడ్డు ప్రమాదం, ఇద్దరు తెలంగాణ యువతుల మృతి…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; డిసెంబర్ 29.
(అఖండ భూమి న్యూస్):
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థులు మరణించారు. కాలిఫోర్నియాలో కారులో యాత్రకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గార్ల మీసేవ కేంద్రం నిర్వహికుడు నాగేశ్వరరావు కూతురు మేఘన (25), ముల్కనూర్ ఉపసర్పంచ్ కోటేశ్వరరావు కూతురు భావన (24)లు ప్రాణాలు వదిలారు. వీరు ఎంఎస్ పూర్తి చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది….


