*2027 ఆగస్టు 15 నాటికి బుల్లెట్ రైలు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 3 (అఖండ భూమి న్యూస్);
2027, ఆగస్టు 15న దేశంలో తొలి బుల్లెట్ రైలును ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ గురువారం వెల్లడించారు.
ముంబై-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు ప్రాజెక్టు వచ్చే ఏడాది ఆగస్టు 15కు పూర్తవుతుందని, దశల వారీగా కార్యకలాపాలు ప్రారంభమవుతాయని ఆయన చెప్పారు.
*త్వరలో వందే భారత్ స్లీపర్ రైళ్లు*
పశ్చిమబెంగాల్, అస్సాం రాష్ర్టాలను కలుపుతూ గువాహటి-కోల్కతా మధ్య తొలి రైలును ప్రారంభించేందుకు కేంద్రం సిద్ధమవుతున్నది.


