కోడి గుడ్డు కూర వండాలేదని భర్త ఆత్మహత్య : యూపీలో విషాద!

కోడి గుడ్డు కూర వండాలేదని భర్త ఆత్మహత్య : యూపీలో విషాద!

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 11.( అఖండ భూమి న్యూస్):

జనవరి.10 శనివారం రాత్రి ఉత్తరప్రదేశ్ లోని బంధాలో 28 ఏళ్ల శుభం సోనీ, అనే యువకుడు తన భార్య కోడిగుడ్డు కూర వండలేదని తీవ్ర మనస్థాపానికి గురై ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అతనికి ఎనిమిది నెలల క్రితం వివాహమైనది ఆయన పనికి వెళ్లి వచ్చాక రాత్రిపూట కోడిగుడ్డు కూర తినాలి అనిపించి భార్యతో వండించుకొని తినాలి అనుకున్నాడు వండమని భార్యకు చెప్పాడు. ఆమె వండనని చెప్పడంతో గొడవ జరిగింది. వారి కుటుంబ సభ్యులు ఇద్దరికీ సర్ది చెప్పారు ఆ తర్వాత ఇంట్లోకి వెళ్లి స్వయంగా వంట చేయడానికి ప్రయత్నించిన అతడు కాసేపటికి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన జరగడంతో వారి కుటుంబ సభ్యులు బంధుమిత్రుడు తీవ్ర విషాదంలో ఉన్నారు…

Akhand Bhoomi News

error: Content is protected !!