*రైతు భరోసాను వెంటనే విడుదల చేయాలి…
తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ డిమాండ్..
*కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 12 (అఖండ భూమి న్యూస్);
రైతు భరోసాని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సోమవారం ధర్నా కార్యక్రమం నిర్వహించి కలెక్టర్ కి మెమోరాండం అందించారు.కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు మోతీ రామ్ నాయక్ జిల్లా అధ్యక్షులు దొడ్లేమోహన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి దశరథ్ వారు మాట్లాడుతూ రైతు భరోసా డిసెంబర్ నెలలోనే విడుదల కావాల్సింది ఉండే కానీ జనవరి పూర్తి వరకు కాలయాపన చేస్తా ఉన్నారు రైతులు అధిక వడ్డీతో అప్పులు తెచ్చుకొని అనేక ఆవస్తాలు పడతున్నారు. కానీ ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సంక్రాంతి రెండు రోజులు ముందే రైతుబరసన విడుదల చేయాలని మనస్ఫూర్తిగా రైతులు కోరుతున్నారు. లేనిచో జిల్లాలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని దిగుతామని రైతు సంఘం కమిటీ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఈ కార్యక్రమంలో మధుసూదన్ గణేష్, నన్యా నాయక్, దేవి సింగ్ నరాన్ నాయక్, బాల వీరయ్య, పోశయ్య, రైతులు పాల్గొన్నారు
You may also like
కలెక్టరేట్ ప్రజావాణిలో 125 దరఖాస్తులు స్వీకరణ…
_పీఎం కిసాన్ డబ్బులు పడలేదా? ఈ నెంబర్కు కాల్ చేస్తే చాలు!_
కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు…
ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ ఐ ఆర్) 2026 ఓటరు జాబితా పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం…
25 న నిర్వహించనున్న నశా ముక్త్ భారత్ అభియాన్ ర్యాలీని విజయవంతం చేయాలి…


