*రైతు భరోసాను వెంటనే విడుదల చేయాలి…
తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ డిమాండ్..
*కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 12 (అఖండ భూమి న్యూస్);
రైతు భరోసాని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సోమవారం ధర్నా కార్యక్రమం నిర్వహించి కలెక్టర్ కి మెమోరాండం అందించారు.కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు మోతీ రామ్ నాయక్ జిల్లా అధ్యక్షులు దొడ్లేమోహన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి దశరథ్ వారు మాట్లాడుతూ రైతు భరోసా డిసెంబర్ నెలలోనే విడుదల కావాల్సింది ఉండే కానీ జనవరి పూర్తి వరకు కాలయాపన చేస్తా ఉన్నారు రైతులు అధిక వడ్డీతో అప్పులు తెచ్చుకొని అనేక ఆవస్తాలు పడతున్నారు. కానీ ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సంక్రాంతి రెండు రోజులు ముందే రైతుబరసన విడుదల చేయాలని మనస్ఫూర్తిగా రైతులు కోరుతున్నారు. లేనిచో జిల్లాలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని దిగుతామని రైతు సంఘం కమిటీ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఈ కార్యక్రమంలో మధుసూదన్ గణేష్, నన్యా నాయక్, దేవి సింగ్ నరాన్ నాయక్, బాల వీరయ్య, పోశయ్య, రైతులు పాల్గొన్నారు
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…


